అనుకున్న దొకటి.. అయిందొకటి.. బొల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా.. అని ఓ పాత సినిమా పాట అందరూ వినే ఉంటారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఇప్పుడు ఈ పాట బాగా సూట్ అవుతుంది. ఇంతకీ ఎందుకు అలా అంటున్నారా అని అనుకుంటున్నారా.... కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పీసీసీ చీఫ్లకు ఆమె రాసిన లేఖలకు స్పందన అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం రాజకీయంగా, ఎన్నికలపరంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది కాంగ్రెస్ పార్టీ. అయితే పార్టీకి జవసత్వాలు పెంచాలంటే ఏం చేయాలో అభిప్రాయాలను తెలియజేయాలని కోరుతూ పీసీసీ చీఫ్లకు సోనియా గాంధీ లేఖలు రాశారు. అన్ని స్థాయిల నేతల్లో నూ జవాబుదారీతనాన్ని పెంచడం, సంస్థాగత సంస్క రణలు, కేడర్ బిల్డింగ్ తదితర లక్ష్యాలను వివరించారు. పార్టీని పునరుజ్జీవింపజేసేందుకు సలహాలు, ప్రశ్నలతో కూడిన ఏఐసీసీ సర్క్యులర్పై ఫిబ్రవరి 28లోగా అభిప్రాయాలు తెలియజేయాలని సోనియా కోరారు.
రాహుల్ గాంధీ స్వయంగా పార్టీ నేతలతో చర్చలు జరిపి, పార్టీ పునరుజ్జీవానికి రూపొందించిన సలహాలను కూడా సోనియా ఈ లేఖల్లో వివరించారు. పీసీసీలు ఏఐసీసీకి తమ అభిప్రాయాలను తెలియజేయడానికి ముందు జిల్లా, బ్లాకు స్థాయిల్లో పార్టీ కేడర్తో సమావేశాలు ఏర్పాటు చేసి, చర్చించి, నివేదికలు రూపొందించాలని సోనియా ఆదేశించారు. పీసీసీల నుంచి వచ్చే స్పందనలను ఏఐసీసీ సమావేశాలకు ముందు పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ విశ్లేషించ వలసి ఉంది. తద్వారా ఏఐసీసీ సమావేశాల్లో కొత్త ఎజెండా రూపొందించాలని కాంగ్రెస్ నాయకత్వం అనుకుంది. ఇన్ని లక్ష్యాలు పెట్టుకున్నప్పటికీ సోనియా లేఖలపై స్పం దించిన పీసీసీలను వేళ్లపై లెక్కించవచ్చు. తెలంగాణ, కేరళ, తమిళనాడు, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ పీసీసీలు మాత్రమే ఫిబ్రవరి 28 గడువు లోగా తమ అభిప్రా యాలతో కూడిన నివేదికలను సమర్పించాయి. కాగా మిలిగిన పిసిసిలు మాత్రం ఇంకా మీనవేషాలు లెక్కిస్తున్నాయి. అయితే నిన్నటి దాకా అమ్మ అనుగ్రహం కోసం ఎదురు చూసిన వాళ్లు అమ్మే స్వయంగా లేఖలు రాసినా పట్టించుకోవడం లేదు. బలం లేనప్పుడు అరటిపండు తిన్నా పళ్లు ఊడుతుందని తెలుగులో సామెత ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పరిస్థితి ఇలానే ఉంది. అధికారం చేతిలో చేదు కాబట్టి ఎవరూ పాపం అమ్మగారిని చూసి భయపడటం లేదు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more