ఏపి అసెంబ్లీ తన మాటల తూటాలతో ప్రకంపనలు పుట్టించిన రోజా ఇంకా తన మాటలను ఇంకా ఆపడం లేదు. స్పీకర్ ను ఓ ఫ్యాక్షనిస్టు అని సంబోధించిన రోజా తాజాగా మరో సారి స్పీకర్ పై మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు వైఖరిపై కూడా రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ తరఫున జగన్ తరువాత చంద్రబాబు, ఏపి సర్కార్ పై రోజా ఈటెల్లాంటి మాటలతో దాడికి దిగారు.
అసెంబ్లీలో తనను ఎదుర్కోలేకే టీడీపీ బురదజల్లే ప్రయత్నం చేస్తోందని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. తమ సభ్యులను అవమానపరిచిన చంద్రబాబు, దేవినేని ఉమా తదితరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టబోతున్నామని ఆమె తెలిపారు. అసెంబ్లీ తమ ఆస్తి అని ఎవరికి ఏం జరిగినా మెజారిటీ అభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకోవాలన్నారు. అసెంబ్లీ నుంచి తనను తరిమేయాలని చూస్తున్నారని రోజా ధ్వజమెత్తారు. రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న స్పీకర్ పై మరోసారి నోరు పారేసుకుంది రోజా. 67 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఉద్దేశించి చంద్రబాబు, పిచ్చి పిచ్చిగా ఉందా మీ అంతు చూస్తా అని వార్నింగ్ ఇచ్చారని దీనిపై స్పీకర్ చర్య తీసుకోవాలని రోజా డిమాండ్ చేశారు. సినీ రంగం నుండి వచ్చిన తనను అవమానిస్తే అదే రంగం నుండి వచ్చిన ఎన్టీఆర్, బాలకృష్ణలను కూడా అవమానించినట్లే అని రోజా అన్నారు. మొత్తానికి పాపం ఎన్టీఆర్ ను, బాలకృష్ణను కూడా తన వివాదంలోకి లాగింది. అయితే ఎటు తిరిగినా రోజా తెలుగుదేశం పార్టీ ని టార్గెట్ గా చేస్తోంది. బోండా ఉమ పాతరేస్తానని అన్నా, పీతల సుజాత తన కాలి గోటికి కూడా సరిపోనని అన్నా స్పీకర్ వారిపై చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు. మొత్తానికి ఓ పక్క స్పీకర్ ను తిడుతూనే, చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని రోజా డిమాండ్ చేస్తోంది.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more