Ttdp leaders celebrated ugadi festival at nrt trust bhavan

ttdp, trs, ugadi, letter, ntr trustbhavan, hyderabad, sujana chowdary, l.ramana

ttdp leaders celebrated ugadi festival at nrt trust bhavan. telanagana telugudesam party leaders commenced to celebrates at ntr trust bhavan, hyderabad. ttdp leaders wrote a letters on trs party.

వాళ్లు చెప్పిందే వేదం, చేసిందే శాసనమట.!

Posted: 03/21/2015 01:06 PM IST
Ttdp leaders celebrated ugadi festival at nrt trust bhavan

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో టిడిపి నేతలు ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేంద్రమంత్రి సుజనా చౌదరి, టీటీడీపీ నేత ఎల్‌.రమణ, పలువురు తెలంగాణ టిడపి నేతలు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు టీడీపీ శాసనసభాపక్షం బహిరంగ లేఖ రాసింది. ప్రజలకు న్యాయం చేయాలని అడిగినందుకు టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేశారని లేఖలో పేర్కొన్నారు. తమ వైఫల్యాలు, ప్రజా సమస్యలు చర్చకు రాకుండా చేసుకోవచ్చని ప్రభుత్వం భావించిందని టీడీపీ నేతలు తెలిపారు. జాతీయగీతం అప్పుడు సభలో ప్రకటన చేయలేదన్నారు. టీడీపీ సభ్యులపై దాడిని కప్పిపుచుతున్నారని మండిపడ్డారు. సస్పెన్షన్‌ తప్పని విపక్షాలు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని లేఖలో టీడీఎల్పీ పేర్కొంది. తాము చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లు టీఆర్‌ఎస్‌ తీరు ఉందని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌కు ప్రజాస్వామ్య వ్యవస్థలు, ప్రతికాస్వేచ్ఛ అక్కర్లేదు, ప్రతిపక్షాలు ఉండకూడదన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజల మద్దతు కావాలని కోరారు. ఎందరో త్యాగాలతో తెలంగాణ ఏర్పడిందని, నిరంకుశులు ఏలితే అంతిమంగా ప్రజలకే నష్టమని టీడీఎల్పీ నేతలు లేఖలో పేర్కొన్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ttdp  trs  ugadi  letter  ntr trustbhavan  hyderabad  sujana chowdary  l.ramana  

Other Articles