మరణించిన రైతు కుటుంబానికి లక్ష రూపాయల ఎక్స్గ్రేషియా, ఒకేసారి రుణ పరిష్కారం కోసం 50వేల మొత్తాన్ని ప్రభుత్వం సమకూరుస్తుందని తెలంగాణ వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వారి పిల్లలకు సాంఘిక సంక్షేమ పాఠశాలలు, హాస్టళ్లలో అడ్మిషన్లు కల్పిస్తామన్నారు. ఐఏవై పథకం కింద గృహాల కేటాయింపు, ప్రభుత్వ పథకాల కింద ఆర్థిక మద్దతునిస్తామని వివరించారు.ఆత్మహత్యల నివారణకు వ్యవసాయ శాఖ ద్వారా తీసుకున్న చర్యలను ప్రభుత్వం సభ దృష్టికి తీసుకొచ్చింది. పంటకాలంలో వ్యవసాయ శాఖ ద్వారా, కెవికెల ద్వారా రైతులకు సలహాలు అందిస్తారన్నారు. పంట రుణాలు లభించే చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. రుణాలు సకాలంలో చెల్లిస్తే లక్ష వరకు వడ్డీలేని పంట రుణాలు, లక్షనుంచి మూడు లక్షల వరకు పావలా వడ్డీతో రుణాలు అందేలా చేస్తామన్నారు. లక్ష రూపాయల వరకు రుణ మాఫీ పథకం అమలు చేస్తున్నట్టు చెప్పారు.
కౌలుదారులకు రుణాలు అందించే ఏర్పాట్లు, పంటల బీమా పథకానికి గ్రామాన్ని ఒక యూనిట్గా చేసినట్టు తెలిపారు. పంటల బీమా కోసం ప్రభుత్వం ప్రీమియం సబ్సిడీని సమకూరుస్తుంది. రైతులకు విత్తనాలు సమకూర్చడానికి గ్రామ విత్తన పథకాన్ని అమలు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత తొమ్మిది నెలల కాలంలో రాష్ట్రంలో 96మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రభుత్వం సోమవారం శాసన సభకు లిఖిత పూర్వక సమాధానంలో తెలిపింది. రైతుల ఆత్మహత్యలపై వివిధ పార్టీల సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రెవెన్యూ మంత్రి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. 2 జూన్ 2014 నుంచి 28 ఫిబ్రవరి 2015 మధ్యకాలంలో 96మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more