ఏపీ శాసనసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టారు. నవ్యాంధ్ర రాష్ట్రంలో తొలిసారిగా మంత్రి యనమల పూర్తి వార్షిక స్థాయి రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్
ప్రవేశపెడుతూ రాజ్యంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలను ప్రసావిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించారు. యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ మొత్తం రూ.1,13,049 కోట్లుగా వెల్లడించారు.
ప్రణాళికా వ్యయం రూ.34,412 కోట్లు గా నిర్ణయించినట్లు చెప్పారు. ప్రణాళికేతర వ్యయంగా 78 వేల 637 కోట్ల రూపాయలను చూపారు.
రాష్ట్ర బడ్జెట్ లో ఆర్థిక లోటుగా 17, 584 కోట్ల రూపాయలను చూపిన యనమల, రెవెన్యూ లోటును 7300 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. గత ఏడాది బడ్జెట్ రెవెన్యూ లోటుగా రూపాయలు 14, 242 కోట్ల
రూపాయలను చూపారు. ఇక బడ్జెట్ కేటాయింపుల్లో రెవెన్యూ శాఖ కు 14 వేల 29 కోట్ల రూపాయలను కేటాయించారు యనమల. తెలంగాణ ప్రభుత్వం తరహాలోనే ఆంధ్రప్రదేశ్ లో కూడా విద్యారంగానికి బారీగా నిధులను కేటాయించారు యనమల పాఠశాల విద్యాశాఖకు 14 వేల 962 కోట్ల రూపాయలు, ఉన్నత విద్యా శాఖు 3 వేల 49 కోట్లను, ఇంటర్ విద్యకు 585 కోట్ల రూపాయలను కేటాయించారు.
నవ్యాంధ్ర బడ్జెట్ లోని ముఖ్యాంశాలు..
* ఆర్థిక లోటు రూ.17584 కోట్లు
* రెవెన్యూ లోటు రూ.7,300 కోట్లు
* గత బడ్జెట్ రెవెన్యూలోటు రూ.14,242 కోట్లు
* రెవెన్యూ శాఖకు రూ. 14,029 కోట్లు
* పాఠశాల విద్యా శాఖకు రూ. 14,962 కోట్లు
* ఉన్నత విద్యకు రూ.3,049 కోట్లు
* ఇంటర్ విద్యకు రూ.585 కోట్లు
* విద్యుత్ శాఖకు రూ.4360 కోట్లు
* రహదారులు-భవనాల శాఖకు రూ.2,960 కోట్లు
* నీటిపారుదలశాఖకు రూ.5,258 కోట్లు
* బీసీ సంక్షేమశాఖకు రూ.3,231కోట్లు
* పోలీసుశాఖకు రూ.4,062 కోట్లు
* గనులు, భూగర్భశాఖకు రూ.27కోట్లు
* పర్యాటక సాంస్కృతిక శాఖకు రూ.339 కోట్లు
* నైపుణ్యాల అభివృద్ధికి రూ.360కోట్లు
* రవాణా శాఖకు రూ.122 కోట్లు
* విపత్తు నిర్వహణకు రూ.488 కోట్లు
* అటవీ శాఖకు రూ.284 కోట్లు
* కార్మికశాఖకు రూ.281 కోట్లు
* ఐటీశాఖకు రూ.370 కోట్లు
* పరిశ్రమల శాఖకు రూ.637 కోట్లు
* మౌలిక సదుపాయాలు, పెట్టుబడులకు రూ.195 కోట్లు
* గోదావరి పుష్కరాలకు రూ.200 కోట్లు
* చేనేత-జౌళి శాఖకు రూ.46 కోట్లు
* వికలాంగులు, వృద్ధుల సంక్షేమానికి రూ.45కోట్లు
* స్త్రీ, శిశు సంక్షేమశాఖకు రూ.1,080 కోట్లు
* మైనార్టీ సంక్షేమానికి రూ.379 కోట్లు
* గిరిజన సంక్షేమశాఖకు రూ.993 కోట్లు
* వైద్య ఆరోగ్య శాఖకు రూ. 5,728 కోట్లు
* పంచాయతీ రాజ్ శాఖకు రూ.296 కోట్లు
* గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 8,212 కోట్లు
* వైద్య ఆరోగ్య శాఖకు రూ. 5,728 కోట్లు
* వికలాంగులు, వృద్ధుల సంక్షేమానికి రూ.45కోట్లు
* నీటిపారుదలశాఖకు రూ.5,258 కోట్లు
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more