నిరుద్యోగులకు ఉపకార వేతనాలు ఇవ్వడంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న గణంకాల లెక్క తేలాల్సిందేనన్నారు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు. స్థానికులు, స్థానికేతరుల లెక్క తేలాలని, స్థానికేతరులకు ఇప్పుడు ఉపకారవేతనం ఇస్తే, వారు ఉద్యోగాల్లోనూ పోటీపడతారన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ 371డి ప్రకారం స్థానికులను గుర్తిస్తారన్నారు. తెలంగాణ యువతను దృష్టిలో పెట్టుకుని ఉపకారవేతనాలు ఇస్తామన్నారు. ఒప్పంద ఉద్యోగుల్లో స్థానికులు కానివారు చాలామంది ఉన్నారన్నారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ తప్పకుండా చేస్తామన్నారు. ఉద్యోగాల విషయంలో యువత ఆందోళన చెందవద్దని, రాబోయే రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు రాబోతున్నాయని కేసీఆర్ తెలిపారు.
తెలంగాణ కష్టాల్లో ఉన్నా కక్ష గట్టి ఏపీ విద్యుత్ ఇవ్వలేదని, ఇప్పుడు ఇస్తామన్నా తాము తీసుకోబోమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శాసనసభలో మాట్లాడుతూ ఆయన కేంద్రం చెప్పినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖాతరు చేయలేదన్నారు. రాష్ట్ర రైతాంగం కష్టాలు పడకూడదని రూ. 1500 కోట్లతో విద్యుత్ కొని రైతులకు ఇచ్చి పంటలు కాపాడుకున్నామన్నారు. ప్రస్తుత సీజన్లో ఎకరం పంటకూడా ఎండనివ్వకుండా చూస్తామన్నారు. వచ్చే మార్చి తర్వాత రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండవని కేసీఆర్ పేర్కొన్నారు.
నూటికి నూరు శాతం కొత్త సచివాలయాన్ని నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో కొత్త సచివాలయాన్ని నిర్మించి తీరుతామన్నారు. సచివాలయానికి వాస్తు బాగోలేదంటే నానాయాగి చేశారన్నారు. హెచ్ వో డీలన్నీ ఒకే చోట ఉంటే తప్పేంటని కేసీఆర్ ప్రశ్నించారు. ఏపీ సీఎం, మంత్రులను గౌరవించాలని అధికారులకు చెప్పినట్లు కేసీఆర్ తెలిపారు. ఏపీ ఉద్యోగులు మరో కొన్నాళ్ల పాటు హైదరాబాద్ లో అభ్యంతర లేదని కేసీఆర్ తెలిపారు. ఏపీ నుంచి జీతాలు తీసుకుని తమకు ట్యాక్స్ కడితే మంచిదన్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more