ఏపి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుండి తగినన్ని నిధులు అందడం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అరకొర నిధులతో సరిపెట్టడంతో రాష్ట్రం ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటోందని అన్నారు. రాష్ట్ర రాజధాని నిర్మాణం, సాగు, తాగునీటి ప్రాజెక్ట్లకు కేంద్రం నుండి నిధులు అనుకున్న స్థాయిలో నిధులు అందడం లేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ చేసిన హామీలు నెరవేర్చడం లేదని. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సరైన న్యాయం జరగలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు పరిష్కరించడానికి కేంద్రం చర్యలు చేపట్టలేదన్నారు. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి తగినన్ని నిధుల కేటాయింపులు జరగలేని తెలిపారు. జపాన్, సింగపూర్ తదితర దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తున్నాయని వెల్లడించారు.
జపాన్ ప్రతినిధులు పరిశ్రమల స్థాపనకు సిద్దంగా ఉన్నారని, కృష్ణపట్నం పోర్టు, తీరప్రాంత కారిడార్ను పరిశీలించారని తెలిపారు. రాజధాని నిర్మాణానికి నిధులు లేవని, అందుకు గాను ప్రైవేటు పెట్టుబడుల వైపు చూడాల్సి వస్తోందని అన్నారు. తన కర్తవ్యాన్ని నెరవేర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానన్నారు. త్వరలో ప్రధాని మోదీని కలిసి రాష్ట్భ్రావృద్ధికి కేంద్రం నుండి అధిక నిధులు తీసుకురావడానికి తనవంతు కృషి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more