రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రవిత్ర ఫుణ్యక్షేత్రం, కలియుగ వైకుంఠంగా బాసిల్లుతున్న ఏడుకోండల తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కొల్పయిన నేపథ్యంలో తెలంగాణ భక్తుల కోసం అందుకు ధీటుగా యాదగిరిగుట్టను అభివృద్దికి ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. ఇప్పటికే వంద కోట్ల రూపాయల నిధులను విడుదల చేసి.. టెంపుల్ సిటీగా మార్చతున్నారు. ఈ నేపథ్యంలో యాదగిరి గుట్ట అభివృద్ధికి వెయ్యి కోట్ల రూపాయల మేర అవసరం అవుతున్న నేపథ్యంలో ఆయన బడా కార్పొరేట్ సంస్థల సహకారాన్ని తీసుకోనున్నారు.
రాష్ట్రంలోనే అత్యద్భుత ఆధ్మాత్మిక కేంద్రంగా, తెలంగాణ టెంపుల్ సిటీగా యాదాద్రిని తీర్చిదిద్దాలనుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సహకరించేందుకు టాటా, అంబానీలు సిద్ధమయ్యారు, శ్రీలక్ష్మీ నారసింహుడు కొలువైన పుణ్యక్షేత్రం సమగ్రాభివృద్ధిలో కార్పొరేట్ సంస్థలు కూడా పాలుపంచుకోనున్నట్లు తెలుస్తోంది. కార్పొరేట్ల సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) కార్యక్రమం కింద యాదాద్రిపై సౌకర్యాల కల్పనకు దాదాపు రూ. 500 కోట్లు ఖర్చు చేసేందుకు రిలయన్స్, టాటా కంపెనీలు ముందుకొచ్చినట్లు సమాచారం.
గుట్ట అభివృద్ధికి భూ సేకరణ కూడా పూర్తయిన నేపథ్యంలో పనులు వేగంగా జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. సీఎం ఆదేశాల మేరకు యాదగిరిగుట్ట అభివృద్ధి కోసం రెండు వేల ఎకరాల స్థల సేకరణ కూడా పూర్తయింది. అందులో వెయ్యి ఎకరాలకుపైగా భూమిని ఇప్పటికే గుట్ట డెవలప్మెంట్ అథారిటీకి అప్పగించారు. రాయగిరిలో దిల్ సంస్థకు ఇచ్చిన భూమితో పాటు పక్కనే మరో 300 ఎకరాలకుపైగా విలువైన ప్రభుత్వ భూమిని అధికారులు గుర్తించారు. దీన్ని కూడా గుట్ట అథారిటీకి కేటాయించారని, ఇందుకు సంబంధించిన ఫైలు ప్రస్తుతం సీసీఎల్ఏ వద్ద ఉందని అధికారులు చెబుతున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more