దాయాధి దేశం పాకిస్థాన్ను పోడిగేవాళ్లపై విశ్వహిందూ పరిషత్ నేత సాధ్వి బాలికా సరస్వతి వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. భారత్లో ఉంటూ పాకిస్తాన్ను పొగిడేవాళ్లను చెప్పుతో కొట్టాలని అన్నారు. అలా మాట్లాడేవారికి దేశంలో వుండే అర్హతే లేదని, అక్కడికే తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మొగుడి సంపాదన తింటూ.. పక్కింటాయనను పోగిడిన చందంగా.. పాకిస్థాన్ ను పోడిగే వారి వ్యవహారం వుందని ఆమె దుయ్యబట్టారు. ఇలాంటి చర్యలను ఏమాత్రం సహించకూడదని చెప్పారు.
మధ్యప్రదేశ్కు చెందిన సాద్వి బాలిక సరస్వతీ మంగళూరులో హిందూ సమాజోత్సవ కార్యక్రమంలో ముఖ్యవక్తగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలను ఉద్దేశించి అమె మాట్లాడుతూ ఈ దేశంలో ఉంటూ ఇక్కడి తిండి తింటూ పరాయి దేశం పాక్ను పొగడటానికి కనీస సంస్కారాలు వుండాలన్నారు. వాటిని మర్చిపోయేవాళ్లను చెప్పుతో కొట్టి తరిమేయాలన్నారు. ఇలాంటివాటిని సహిచంబోమని, దెబ్బకు దెబ్బకు తీయాల్సిందేనని చెప్పారు.
భారత్ స్వాతంత్ర్యాన్ని శాంతియుతంగా పొందిందని చరిత్ర చెప్పొచ్చుగానీ, పాకిస్థాన్ లో మాత్రం స్వాతంత్ర్యం శాంతియుతంగా లేదంటూ పాక్ను ఉద్దేశించి అన్నారు. నిత్యం బాంబుదాడులు, బులెట్ల శబ్ధాలు ఇలా కాక మరెన్నో అసాంఘిక కార్యకలాపాలు. వీటికి తోడు తీవ్రవాదులకు సర్గధామంగా మారిన పలు ప్రాంతాలు, విచ్చల విడిగా లభిస్తున్న ఆయుధాలతో పాకిస్థాన్ భీతుల్లుతుందని అన్నారు. అయితే పాకిస్థాన్ హింసాత్మక చర్యలకు ధీటుగా భారతీయులందరూ కూడా ఆయుధాలు పట్టుకోవాల్సిన అవసరం వచ్చిందని సభనుద్దేశించి మాట్లాడారు. సాధ్వి బాలికా సరస్వతి వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more