ఎన్నికల్లో గల్లంతైన కాంగ్రెస్ పార్టీని ఇప్పటికీ కష్టాలు వదల్లేదు. ఎఐసిసి అధ్యక్షుడిగా రాహుల్ ఎన్నిక జరుగుతుంది అనుకునే సమయానికి రాహుల్ బాబు సెలవంటూ కనిపించకుండా పోవడం రాజకీయపార్టీల్లో తీవ్ర చర్చకు దారితీసింది. రాహుల్ గాంధీ ఎందుకు సెలవు తీసుకున్నారు.. ఎక్కడ ఉన్నారు..ఏం చేస్తున్నారు ఇలా సవాలక్ష ప్రశ్నలు సోనియా గాంధీని ఓ రకంగా ప్రశ్నల వర్షంతో ముంచెత్తారు మీడియా వారు. ఇక రాహుల్ పలాయనం తర్వాత పార్టీని ఒంటి చేత్తో గెలిపించే సత్తా, ఇందిరా గాంధీ పోలీకలను కలిగిన ప్రియాంక గాంధీపైనా వివాదాలు మొదలయ్యాయి. అక్రమాస్తుల విషయంలో తలెత్తిన వివాదాలు కాంగ్రెస్ అధినేత్రికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి.
తాజాగా ప్రియాంక, రాహుల్ గాంధీల గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చిరాకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక గాంధీ ఏదైనా ప్రాముఖ్యమైన పాత్రను పోషించనున్నారా?, రాహుల్ గాంధీ ఎప్పుడు తిరిగి వస్తారు? అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ఆమె నిరాకరించారు. ఒకే ప్రశ్నను పదే పదే అడుగుతున్నారు. రాహుల్ వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది అంటూ సోనియాగాంధీ చిరాకు పడ్డారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకను నియమించనున్నారని మీడియాలో ఊహాగానాలు కొనసాగుతుండగా, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు వారాల సెలవుపై ఎక్కడికి వెళ్లారన్న విషయం వార్తలకెక్కింది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ ప్రతినిధి రందీప్ సుర్జేవాలా ముందు ప్రస్తావించినప్పుడు రాహుల్ గాంధీ స్వచ్ఛందంగా సెలవుపై వెళ్లారని, ఇటీవల జరిగిన ఘటనలపై ఆయన ఆత్మపరిశీలన చేసుకుంటున్నారని చెప్పారు. ఇక ప్రియాంకకు పార్టీ బాధ్యతలు అప్పగించే విషయం తనకు తెలియదన్నారు. మొత్తానికి తన పిల్లల గురించి పదేపదే ప్రశ్నించడంతో అమ్మగా సోనియా గాంధీకి కాస్త చిరాకుపుట్టినట్లుంది.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more