డీలర్ దుకాణాల ద్వారా జరుగుతున్న నిత్యావసర సరుకుల పంపిణీ విధానంలో మార్పులు రానున్నాయి. డబ్బులు లేకుండానే ఆహార భద్రతకార్డుదారులు, రూపే కార్డులు తీసుకుని వెళ్లి తమ కోటా కింద వచ్చే సరుకులను రేషన్ షాపు నుంచి పొందవచ్చు. భవిష్యత్తులో రేషన్ సరఫరాల్లో అవకతవకలు, తూకాల్లో మోసాలు ఉండవు. రేషన్ షాపులో ఏర్పాటు చేసిన ప్రత్యేక యంత్రంలో మీ రూపే కార్డును స్వైప్ చేయగానే మీకు రావాల్సిన కోటా ఎలక్ట్రిక్ వేయింగ్ మెషీన్ ద్వారా మీ చేతికి అందుతుంది. ఈ విధానం త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే చౌక ధరల దుకాణాల్లో నగదు రహితంగా రూపే కార్డుద్వారా నిత్యావసర సరుకులు సరఫరా చేసేందుకు రంగారెడ్డి జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జనధన్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం పేదలందరికీ రూపే కార్డులను అందజేసిన విషయం తెలిసిందే. ఇక మీదట ఈ కార్డుల ద్వారానే పేదలకు రేషన్ అందించే విధానాన్ని అమలు చేసేందుకు రంగారెడ్డిజిల్లా అధికారులు ప్రయత్నిస్తున్నారు.
రేషన్ షాపులన్నింటిలో పాయింట్ ఆఫ్ సేల్ యంత్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ తరహా యంత్రాలు ఇప్పటికే హైదరాబాద్లో కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. అయితే సాధారణ డెబిట్ కార్డుల ద్వారా డబ్బు చెల్లించే విధంగా వీటిని ఏర్పాటు చేశారు. అయితే కొత్తగా ఏర్పాటు చేసే విధానంలో రూపే కార్డు ద్వారానే సరుకులు కొనుగోలు చేయాలి. అలాగే పీఓస్ మెషిన్ ఇపుడున్న దాని కంటే భిన్నంగా ఉంటుంది. డెబిట్కార్డు స్వైపింగ్తో పాటు లబ్ధిదారులను గుర్తించే విధంగా పీఓస్ మెషిన్ను రూపొందించనున్నారు. దీనికి సంబంధించి కేంద్రం నుంచి మార్గదర్శకాలు అందాలి. వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారులను గుర్తించేందుకు ఐరీస్ కనుపాపలు లేదా వేలిముద్రలు.. ఏవి సేకరించాలి? అనే దానిపై కేంద్రం కూడా కసరత్తు చేస్తోంది. దీనిపై కేబినెట్ త్వరలో నిర్ణయం తీసుకోనుంది. భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఇదే విధానాన్ని రేషన్ పక్రియలో కూడా అమలు చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఈ విధానం అమల్లోకి వస్తే రేషన్ సరఫరాలో అక్రమాలకు కళ్లెం పడడంతో పాటు ప్రభుత్వానికి నెలకు నిత్యావసర సరుకల్లో 10 నుంచి 15 శాతం మిగులు ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి గనదు రహిత ప్రజా పంపిణి వ్యవస్థ తొందరలోనే అందుబాటులోకి రానుంది.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more