తెలుగు వారమండీ నిండుగ వెలుగు వారమండీ అంటూ అప్పుడెప్పుడో విన్న మాట, అన్న మాట కూడా. ఇప్పుడు తెలుగు మాత్రం మిగిలింది కానీ వెలుగు లేదు. తెలుగు రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కేంద్రం దయ కోసం ఎదురుచూస్తున్నాయి. ఎప్పుడెప్పుడు నిధులు విడుదల చేస్తారా అని రెండు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ఎదురుచూస్తున్నారు. అయితే ఎదురుచూపుకు అర్థంలేకుండా పోయింది. ఆది నుండి దక్షిణాది రాష్ట్రాలంటేనే కేంద్రానికి చిన్న చూపు అన్న విషయం మరోసారి నిజమైంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు కాబట్టి వాటి ఆర్థిక పరిపుష్టి కొరకు కేంద్రం ఉదారంగా నిధులను సమూకూరుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది.
ఫైనాన్స్ కమీషన్ ప్రతిపాదనల్లో ఎక్కడా తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకంగా నిధులు కానీ గ్రాంట్లు కానీ విడుదల చెయ్యలేదు. అయితే ఏపిలో తీవ్రమైన లోటు కారణంగా 22వేల కోట్ల రూసాయల సాయం చెయ్యాలని ఆర్థికమంత్రి ప్రకటించారు. ఆర్థికమంత్రి ప్రకటనతో తెలుగు వారు నిరాశకు గురయ్యారు. తెలంగాణ ఊసేలేకుండా పోయింది. మొత్తానికి అటు తెలంగాణకు, ఇటు ఏపికి కనీస ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇలా కేంద్రం రెండు రాష్ట్రాలను ఆదుకోకుండా, తన పంథాలో వెళ్తోంది. అయితే రాష్ట్రాలకు కేంద్ర పన్ను వాటాలో 42శాతం ఇవ్వనుందని, అన్ని రాష్ట్రాలు అభివృద్ది వైపు పరుగులు తియ్యాలని మోదీ పిలుపునిచ్చారు. మోదీ మాటలు నిజం రాష్ట్రాలు బాగున్నప్పుడే దేశం బాగుంటుంది. అయితే దేశంలో అన్ని రాష్ట్రాలకు, తెలుగు రాష్ట్రాలకు భిన్నం. ఎందుకంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఒకటి, ఇంకా కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రం మరోకటి. ఇలా ఎన్నో కష్టాల్లో ఉన్న రెండు రాష్ట్రాలకు చేయూతనియ్యాల్సిన కేంద్రం వాటి గురించి ఆలొచించడం లేదు. ఉమ్మడిగా ఉన్నప్పుడు దేశంలో వేగంగా అభివృద్ది చెందిన తెలుగు రాష్ట్రం ఇప్పుడు మాత్రం అభివృద్దికి ఆమడ దూరంలో ఉంటున్నాయి.
అయితే తాజాగా కేంద్రం విడుదల చెయ్యాలనుకున్న నిధులపై రెండు తెలుగు రాష్ట్రాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అడిగిన దాంట్లో కనీసం పది శాతం నిధులు కూడా రాలేదని, కొత్తగా ఏర్పాటు అయిన రాష్ట్రం అన్న కనీస దయ కూడా లేదని ఏపి నాయకులు మండిపడుతున్నారు. కేంద్రం నిధులపై ఎన్నో నిధులను ఆశించిన తెలంగాణకు ఇదే జరిగింది. వారి ఆశలపై నీళ్లు జల్లింది కేంద్రం. తూతూ మంత్రంగా ఎంతో కొంత విదిల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు అసలు విషయం అర్థం కాదని కొందరు అనుకుంటున్నారు. కాగా కనీసం ఇప్పటికైనా రెండు రాష్ట్రాలకు చెందిన నేతలు మేల్కొని కేంద్రంపై వత్తిడి తేవాలని సూచిస్తున్నారు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more