సెల్ పోన్ వినియోగదారులకు శుభవార్త. త్వరలో సెల్ ఫోన్ చార్జీలు తగ్గనున్నాయి. ఇన్నాళ్లు సెల్ ఫోన్ నుంచి ల్యాండ్లైన్ ఫోన్లకు చేసే కాల్స్ పై విధించిన అదనపు భారం ఇక మీకు పడబోదు. ఎందుకంటే ఎట్టకేలకు ట్రాయ్ ఈ భారాన్ని తొలగించింది. ల్యాండ్లైన్ ఫోన్ల నుంచి ఏ సర్వీస్నకు చెందిన ఇతర ల్యాండ్లైన్ లేదా మొబైల్ ఫోన్కు.. అలాగే సెల్ ఫోన్ నుంచి ఏ సర్వీస్నకు చెందిన ఇతర ల్యాండ్లైన్ ఫోన్లకు చేసే కాల్స్కు వసూలు చేస్తున్న ఇంటర్కనెక్షన్ ఛార్జీలను టెలికాం నియంత్రణ, ప్రాధికార సంస్థ ట్రాయ్ రద్దు చేసింది.
దీంతోపాటు వేర్వేరు మొబైల్ నెట్వర్క్ల మధ్య కూడా ఈ ఛార్జీలను కాల్కు ప్రస్తుత 20 పైసల నుంచి 14 పైసలకు (30 శాతం మేర) తగ్గించింది. ఒక నెట్వర్క్ వినియోగదారుడు, మరో నెట్వర్క్ ఖాతాదారుకు కాల్ చేస్తే, అతని సర్వీసు ప్రొవైడరు కాల్ వెళ్లిన సర్వీస్ సంస్థకు చెల్లించేదే ఇంటర్కనెక్షన్ ఛార్జీ. వినియోగదార్లు చెల్లించే కాల్ రుసుములో ఇది కలిసి ఉంటుంది. ప్రస్తుతం ఇది కాల్కు 20 పైసలుగా ఉంది. ల్యాండ్లైన్కు పూర్తిగా రద్దు కాగా, మొబైల్ సంస్థల మధ్య 14 పైసలకు తగ్గించింది. ఈ నేపథ్యంలో టెలికాం టారిఫ్లు తగ్గే అవకాశం ఉందని, దీంతో పాటు వైర్ లెస్ నుంచి ల్యాండ్ లైన్ ప్లాన్లలోనూ మార్పులు వస్తాయని ట్రాయ్ అశించింది. దీంతో ఇక దేశంలో ల్యాండ్ లైన్ కాల్స్ కు కూడా కాల్స్ పెరుగుతాయని అకాంక్షించింది. దేశంలో అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ను అందించేందుకు, వైర్లైన్ నెట్వర్క్లను మరింత బలోపేతం చేసేందు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రాయ్ తెలిపింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more