పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ప్రభుత్వ లక్ష్యాలను ఆయన వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలు, విజయాలు ఇలా అన్నింటిని రాష్ట్రపతి కూలంకుషంగా చర్చించారు. రాష్ట్రపతికి ప్రధాని మోడీ, రాజ్యసభ, లోక్ సభ స్పీకర్లు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. పారిశుధ్యం నుండి మొదలు కొని స్మార్ సిటీల వరకు అన్నింటిపైనా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తోందని స్పష్టం చేశారు. ఉపాధి కల్పన, ఉత్పత్తి పెంపు, స్మార్ట్ సిటీల నిర్మాణానికి తొలి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ బడ్జెట్ సమావేశాలు సజావుగా జరగాలని రాష్ట్రపతి కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం పేదరికం నిర్మూలనకు కృషి చేస్తుందన్నారు. ధరల తగ్గింపునకు ప్రభుత్వం కృషి చేస్తోందని, జన్ ధన్ యోజనలో 13.2 కోట్ల బ్యాంకు ఖాతాలు నమోదయ్యాయని పేర్కొన్నారు. పేదవాడి కళ్లలో ఆనందం చూడడమే ప్రభుత్వ లక్ష్యమని, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కాలన్నారు. భారత్ ను మ్యాను ఫ్యాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుందన్నారు. 2022 నాటికి అందరికీ ఇళ్ల నిర్మాణం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
కాగా రాష్ట్రపతి ప్రసంగంలో ఎక్కడా తెలుగు రాష్ట్రాల ఊసు వినిపించలేదు. ప్రత్యేక హోదా కల్పించడం గురించి, కనీస ఒక్క మాట కూడా లేపోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి. గత ఎన్నికలకు ముందు యుపిఎ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కొన్నాళ్ల నుండి డిమాండ్ లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలని ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. అయినా రాష్ట్రపతి ప్రసంగంలో కనీసం తెలుగు రాష్ట్రాల పేర్లెత్తకపోవడం గమనార్హం. అయితే ఏపికి ప్రత్యేక హోదా పై పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని ప్రకటన చేస్తారని అప్పుడే ఊహాగానాలు కూడా మొదలవుతున్నాయి.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more