Corporate institutions in petroleum ministry documents leak case

corporate circles.documents leak case, Petroleum Ministry, delhi police, reliance, petrolium documents,

Petroleum Ministry documents leak case: Delhi Police chief says 12 men arrested, probe on. In a development that caused reverberations in political as well as corporate circles, the Delhi Police arrested two energy consultants in connection with leaking of classified documents from the Petroleum Ministry.

తీగ లాగితే...కార్పోరేట్ సంస్థల డొంక కదులుతోంది

Posted: 02/21/2015 08:24 AM IST
Corporate institutions in petroleum ministry documents leak case

దేశంలో సంచలనం సృష్టించిన పెట్రోలియం మంత్రిత్వశాఖలో కీలక పత్రాల దొంగతనం కేసు, కొత్త మలుపు తిరిగింది, పోలీసుల దర్యాప్తులో పెట్రోలియం శాఖతో పాటు ఆర్థిక, బొగ్గు, విద్యుత్ శాఖలకు చెందిన రహస్య సమాచారం కూడా లీక్ అయినట్లు తేలింది. దాంతో దేశంలోని కొన్ని కీలక కార్పోరేట్ సంస్థల బండారం బయటపడింది. ఈ కేసులో రిలయన్స్ ఇండస్ట్రీకి చెందిన ఓ ఉద్యోగిని అరెస్టు చేశారన్న వార్తతో, నిన్న స్టాక్ మార్కెట్ లో రిలయన్స్ షేర్ విలువ మూడు శాతం పడిపోయింది.  చివరకు ఈ నెల 28న ఆర్థికమంత్రి ఇవ్వనున్న బడ్జెట్ ప్రసంగంలోని అంశాలు సైతం ముందే బహిర్గతమవ్వడం కార్పొరేట్ గూఢచర్యపు లోతులను కళ్లకు కడుతోంది.

ఢిల్లీలోని శాస్త్రి భవన్‌లోని పెట్రోలియం శాఖ ప్రధాన కార్యాలయం నుంచి కీలక రహస్య పత్రాలు మాయం కేసులో  పోలీసులు ఇద్దరు పెట్రో కన్సల్టెంట్లు, ఐదు ప్రముఖ కార్పొరేట్ సంస్థలకు చెందిన ఐదుగురు ఈ కేసులో ఇప్పటివరకు 12 మందిని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఎస్సార్, కెయిర్న్స్ ఇండియా, జూబిలెంట్ ఎనర్జీ, రిలయన్స్ అనిల్‌ధీరూభాయి అంబానీ గ్రూప్ లకు చెందిన వ్యక్తులు ఇందులో ఉన్నారన్న అనుమానంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. మొత్తానికి దేశంలో కొన్నికార్పోరేట్ సంస్థలు తమ ప్రయోజనాల కోసం ఇలా తప్పుడు విధానంలో పత్రాలను సంపాదించడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంపై సీనియర్ గా ఉంది.
-అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles