దేశంలో సంచలనం సృష్టించిన పెట్రోలియం మంత్రిత్వశాఖలో కీలక పత్రాల దొంగతనం కేసు, కొత్త మలుపు తిరిగింది, పోలీసుల దర్యాప్తులో పెట్రోలియం శాఖతో పాటు ఆర్థిక, బొగ్గు, విద్యుత్ శాఖలకు చెందిన రహస్య సమాచారం కూడా లీక్ అయినట్లు తేలింది. దాంతో దేశంలోని కొన్ని కీలక కార్పోరేట్ సంస్థల బండారం బయటపడింది. ఈ కేసులో రిలయన్స్ ఇండస్ట్రీకి చెందిన ఓ ఉద్యోగిని అరెస్టు చేశారన్న వార్తతో, నిన్న స్టాక్ మార్కెట్ లో రిలయన్స్ షేర్ విలువ మూడు శాతం పడిపోయింది. చివరకు ఈ నెల 28న ఆర్థికమంత్రి ఇవ్వనున్న బడ్జెట్ ప్రసంగంలోని అంశాలు సైతం ముందే బహిర్గతమవ్వడం కార్పొరేట్ గూఢచర్యపు లోతులను కళ్లకు కడుతోంది.
ఢిల్లీలోని శాస్త్రి భవన్లోని పెట్రోలియం శాఖ ప్రధాన కార్యాలయం నుంచి కీలక రహస్య పత్రాలు మాయం కేసులో పోలీసులు ఇద్దరు పెట్రో కన్సల్టెంట్లు, ఐదు ప్రముఖ కార్పొరేట్ సంస్థలకు చెందిన ఐదుగురు ఈ కేసులో ఇప్పటివరకు 12 మందిని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఎస్సార్, కెయిర్న్స్ ఇండియా, జూబిలెంట్ ఎనర్జీ, రిలయన్స్ అనిల్ధీరూభాయి అంబానీ గ్రూప్ లకు చెందిన వ్యక్తులు ఇందులో ఉన్నారన్న అనుమానంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. మొత్తానికి దేశంలో కొన్నికార్పోరేట్ సంస్థలు తమ ప్రయోజనాల కోసం ఇలా తప్పుడు విధానంలో పత్రాలను సంపాదించడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంపై సీనియర్ గా ఉంది.
-అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more