ఢిల్లీ ఎన్నికలకు వెళ్లిన ఆప్ అదినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు క్షమాపణలు చెప్పడం.. అక్కడ ఆయనకు కలసి వచ్చింది. తన ప్రబుత్వానికి తిరుగులేని మోజారిటీనిఅందించారు ప్రజలు. దీంతో ఆయన భాటలోనే పయనించేందుకు సిద్దమయ్యారు రాష్ర్ట విభజన విషయంలో తప్పు చేశామని, ప్రజలు క్షమించాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి నవ్యాంద్ర ప్రజలను కోరారు. తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా మంగళవారం ఎంఆర్పల్లిలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. అన్ని పార్టీల అంగీకారంతో విభజన చేశామని, ఇప్పుడు ఆ పాపం కాంగ్రెస్ నెత్తిన వేస్తున్నారని ఆయన అన్నారు.
దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర మాజీ మంత్రి, ఏఐసీసీ సభ్యుడు తిరువక్కరుసు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇస్తే తప్పును సరిదిద్దుకుంటామని చెప్పారు. 126 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ చేసిన చిన్న తప్పునకు ప్రజలు మరణ శిక్ష విధించారని టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు అన్నారు. తప్పు తెలుసుకున్నామని, మీ ఓటుతో మరణ శిక్షను తొలగించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి బండారు దత్తాత్రేయ కృషి చేస్తుంటే, కేంద్ర మంత్రి వెంకయ్యనాయిడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చేసిందేమిటని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదాపై బీజేపీ బిల్లు పెట్టాలని ఏఐసీసీ పరిశీలకుడు కుంతీయ డిమాండ్ చేశారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more