నితీష్ కుమార్ సిఎం కోసం ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగంగా తనకు మద్దతుగా నిలిచిన 130 మంది ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ ను కలిసారు. అయితే అంతకు ముందు బీహార్ ప్రస్తుత సిఎం మాంఝీ గవర్నర్ ను కలిసి తనకు మెజార్టీ ఉందని, అవసరమైతే బల నిరూపనకు సిద్దమని గవర్నర్తో అన్నట్లు సమాచారం. కాగా నితీష్ కుమార్ మాత్రం తనకు మద్దతుగా 130 ఎమ్మెల్యేలు ఉన్నారని కావున అవకాశం ఇస్తే మెజార్టీ నిరూపించుకొని, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని గవర్నర్ ను కోరినట్లు సమాచారం. పార్టీ నుండి మాంఝీని తీసివేస్తున్నట్లు జెడియు ప్రకటించింది. మరోపక్క తనకు పూర్తి మెజారిటీ ఉందని కావున పదవిలో కొనసాగుతానని జితిన్ రామ్ మాంఝీ తెలిపారు. నితీష్ కుమార్ మాత్రం తనకు అవకాశం ఇవ్వకపోతే 130 మంది ఎమ్మెల్యేలతో కలసి రాష్ట్రపతి భవన్ ముందు పరేడ్ నిర్వహిస్తామని ప్రకటించారు. మొత్తానికి బీహార్ రాజకీయం గంటకోమలుపు తిరుగుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more