ఢిల్లీ లో వాతావరణం ఒక్క సారిగా చల్లారింది. మొన్నటి దాకా ఉన్న హడావిడి మాయమైంది. ఇన్నాళ్లు సాగిన ఎన్నికల ప్రచారానికి ఢిల్లీ ప్రజలు తమ ఓటుతో తుది తీర్పు ఇవ్వనున్నారు. బీజేపీ-ఆప్ ల మధ్య జరిగిన ఎన్నికల ప్రచారం యుద్దాన్ని తలపించింది. ఎన్నికల బరిలో నిలిచిన 673 మంది భవితవ్యాన్ని నేడు ఢిల్లీ ఓటరు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నాడు. 1.33 కోట్ల మంది ఓటర్లు తమ ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించుకోబోతున్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కమీషన్ 12,083 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
గతంలో మెజారిటీ లేకపోవడంతో అధికారానికి దూరమైన బీజేపీ ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఢిల్లీ అధికారపగ్గాలను చేపట్టాలని తహతహలాడుతోంది. మరోపక్క గత ఎన్నికల్లో అధికారంలొకి వచ్చి కొన్ని రోజులు మాత్రమే ప్రభుత్వాన్నినడిపారు కేజ్రీవాల్. కానీ ఈ సారి మాత్రం ఐదు సంవత్సరాల పాటు ప్రభుత్వాన్ని కొనసాగిస్తానని కేజ్రీ ప్రజలకు వాగ్దానం చేశారు. ఆప్ దూకుడుకు కళ్లెం వేసేందుకు బీజేపీ అనూహ్యంగా కిరణ్ బేడిని పార్టీలోకి చేర్చుకోవడంతో పాటు ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలిపింది.ముందు నుండి అన్నా హజారేతో ఉండి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కేజ్రీతొ కలిసి కిరణ్ బేడి పాలుపంచుకున్నారు. కానీ రాజకీయాల్లో ఇలా ప్రత్యర్థులుగా మారడంతో మొదట్లో ఆప్ కాస్త వెనుకబడ్డా తర్వాత నిలదొక్కుకుంది. ఇక ఆప్ , బీజేపీ విమర్శలు తారా స్థాయికి చేరాయి.
నిన్నటి దాకా ఎన్నికల హడావిడిలో ఉన్న నేతలు ఇప్పుడు కాస్త సేద తీరుతున్నారు. ఢిల్లీ ప్రజలు ఎవరికి ఓటెత్తుతారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో ఓటింగ్ సరళికి ఈ సారి భిన్నంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2013 ఎన్నికల్లో 78.1 లక్షల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని రికార్డు స్థాయిలో 65.86శాతం ఓటింగ్ నమోదు చేశారు. 65.78 శాతం పురుషులు, 65.17 శాతం మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఢిల్లీ ఎన్నికలల్లో ఓటు హక్కుల కలిగిన పురుషుల జనాభా 73.89 లక్షలు, మహిళల జనాభా 59.19 లక్షలు.
ఢిల్లీ ప్రజలు 14 నెలల్లో మూడో సారి ఓటువెయ్యాల్సి వస్తోంది కనుక ఈ సారి ఓటింగ్ శాతం తగ్గుతుందని కొందరి విశ్లేషణ. కానీ ఢిల్లీలో మారిన రాజకీయాలు, ఎన్నికల వేడి ఓటర్లను పోలింగ్ బూతుల వైపు నడిపిస్తుందని మరి కొందరి వాదన. ఎన్నికల ఫలితాలపైనా ఎవరి విశ్లేషణ వారిది. ఎన్నికల ప్రచారం ప్రారంభంలో బీజేపీకి పట్టం కడతారని సర్వేలు పేర్కొంటే, ప్రచారం జరుగుతున్నపుడు మాత్రం ఆప్ కు పట్టం కడతారని కొన్ని సర్వేలు తేల్చాయి. మొత్తానికి సర్వేలు ప్రజలు ఏ పార్టీకి అవకాశాన్ని కల్పిస్తారని గట్టిగా చెప్పలేకపోతున్నాయి.
మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి గత ఎన్నికల్లో బీజేపీ, అకాళిదళ్ కు కలిపి 32 సీట్లు, ఆప్ కు 28 సీట్లు, కాంగ్రెస్ కు 8 సీట్లు వచ్చాయి. బీజేపీ ఢిల్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యలేదు. ఓట్ల శాతం పరంగా బీజేపీకి 33.07%, ఆప్ కు 29.49% , కాంగ్రెస్ కు 24.55% , అకాళీదళ్ కు ఒక శాతం ఓట్లు వచ్చాయి. కానీ ఈ ఎన్నికల్లో ఇదే కొనసాగింపు ఉంటుందని ఊహించలేం. గతంలో ఓటింగ్ ప్రారంభం నుండే ఓటర్ల తాకిడి భారీ ఉంది. సాయంత్రం 5 దాటినా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. అయితే అనూహ్యంగా పెరిగిన ఓటింగ్ శాతం ఏ పార్టీకి ఫలితాలు కట్టబడతాయని చెప్పలేని పరిస్థితి నెలకొంది. కానీ ఢిల్లీ ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుతున్నారని అన్ని సర్వేల్లోనూ వెల్లడైన అంశం. ఈ సారి కూడా ఎన్నికల ఫలితాలు ఎవరి అంచనాలకు అందవు అనేది నిజం. ఏది ఏమైనా ఎన్నికల ఫలితాలు వెలువడే దాకా ఈ టెన్షన్ తప్పదు మరి.
-అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more