కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ మృతి కేసులో ప్రత్యేక దర్యాఫ్త సంస్థ గురువారం పలువురు మహిళా జర్నలిస్టులను విచారించింది. మరణానికి కొన్ని గంటల ముందు సునంద పుష్కర్ మాట్లాడిన జర్నలిస్టులను పలు ఆంశాలపై ప్రశ్నించింది. సునంద పుష్కర్ హత్య కేసు దర్యాప్తును ముమ్మరం ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు... ఈ కేసును చేధించేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే సుమారుగా ఏడాది గడిచినందున.. సాక్షాలు తారుమారు కాకుండా అన్ని పకడ్భంధీ చర్యలు తీసుకుంటున్నారు. ఈ కేసు విషయమై ఇప్పటికే సునంద భర్త, కాంగ్రెస్ మాజీ మంత్రి శశిథరూర్ సహా పలువురిని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ప్రశ్నించారు. ఇప్పుడు కొందరు మహిళా, పురుష జర్నలిస్టుల నుంచి వివరాలు సేకరించారు.
సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసు చేధనలో మహిళా జర్నలిస్టుల నుంచి పోందిన సమాచారాన్ని కూడా క్రోడికరించుకుని కేసు దర్యాప్తును మమ్మరం చేస్తున్నారు. వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారు. జర్నలిస్టులు చెప్పిన విషయాలతో శశిథరూర్ చెప్పిన వివరాలను పోల్చుకోనున్నారు. మహిళా జర్నలిస్టులతో ఐపీఎల్ విషయం, లేదా పాకిస్తాన్ జర్నలిస్ట్ మెహర్ తరర్ విషయాలు ఏమైనా చెప్పారా అని ఆరా తీసే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. ఆమె అసలు విలేకరుల సమావేశం ఎందుకు పెట్టాలనుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. శశిథరూర్కు పాకిస్థాన్ న్యూస్ ప్రెజెంటర్ మెహర్ తరర్తో నడిపి అఫైర్ కు సంబంధించిన సమాచారంతో పాటు ఐపీఎల్ విషయంలో సునంద నోరు విప్పేందుకు ప్రయత్నాలు చేశారనే వార్తల నేపథ్యంలో దర్యాఫ్తు బృందం ఇద్దరు మహిళా జర్నలిస్టులను, ఒక పురుష జర్నలిస్టును విచారించినట్లు సమాచారం
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more