పుట్టినరోజు పార్టీలకు ఆహ్వానాలు అందడం సాధారణంగా జరిగుతుంది. అయితే పిలిచిన ప్రతీ ఆహ్వానానికి వెళ్లనూ లేము. కుదిరితే వెళ్తాం.. లేకపోతే లేదు. ఇక పలు సందర్బాల్లో కొందరిని తప్పని సరి పరిస్థితుల్లో కూడా ఆహ్వానాలు పలకాల్సి వస్తుంది. అయితే అలాంటి వారు తమ పార్టీలకు రాకపోతే సంతోషిస్తాం.. అదే అదనుగా చేసుకుని దెప్పి పోడుస్తుంటాం కూడా. కానీ, తన కొడుకు పుట్టినరోజు పార్టీకి పిలిస్తే రానందుకు ఓ కన్నతల్లికి చిరెత్తుకోచ్చింది. ఆహ్వానించినా కార్యక్రమానికి రానందుకు జరిమానా విధించింది. అంతేకాదు చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటానని బెదిరించింది.
లండన్లో జరిగిన ఈ చిత్రమైన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి... క్రిస్మస్కు కొద్దిరోజుల ముందు జరిగిన పార్టీకి అలెక్స్ నాష్ అనే కుర్రాడిని పిలిచారు. అయితే, అతడు ఆ పార్టీకి వెళ్లలేదు. దాంతో పార్టీకి పిలిచిన పిల్లాడి తల్లి జూలీ లారెన్స్కు బోలెడంత కోపం వచ్చింది. పార్టీకి రాకపోతే ముందుగానే సమాచారాన్ని తెలియజేయాల్సింది పోయి.. ఏ మాత్రం సమాచారం లేకుండా తన కుమారుడి జన్మదిన వేడుకకు గైర్హజారు కాపడంపై కన్నెర్ర చేసింది. అలెక్స్ నాష్ రాకపోవడం వల్ల తనకు అనవసరంగా బోల్డంత ఖర్చయిందని.. పార్టీకి రానందుకు అతడి కోసం తాము ఖర్చుచేసిన రూ. 1500 జరిమానాగా చెల్లించాలని చెప్పింది.
అంతటితో ఆగకుండా. కుర్రాడిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటానని హెచ్చరించింది. అయితే జరిమానాను అందుకున్న కుర్రాడి తండ్రి మాత్రం ఈ విషయాన్ని కోర్టులోనే తేల్చుకుంటానన్నారు. అంతేకాని డబ్బు చెల్లించేది లేదని అలెక్స్ తండ్రి చెప్పారు. వాస్తవానికి ఆ సమయంలో అలెక్స్ తన నాయనమ్మ, తాతయ్యలతో గడపాల్సి వచ్చిందని.. అందుకే ఆ పార్టీకి వెళ్లలేదని అంటున్నారు. ఆ విషయాన్ని చెబుదామంటే లారెన్స్ ఫోన్ నెంబర్ తమ వద్ద లేదన్నారు. అయినా పార్టీకి రాకపోతే జరిమానా విధించడమేంటని ఆయన ప్రశ్నించాడు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more