తెలంగాణ ప్రభుత్వం తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. సర్కారు తీసుకొచ్చిన వివాదాస్పద ఫాస్ట్ జీవో (Financial Assistance for Students of Telangana)పై వివరణ ఇవ్వటంలో ఆలస్యం ఎందుకని ప్రశ్నించింది. జీఓపై కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో చెప్పాలని ఆదేశించింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలుకు ఇప్పటికే రెండు సార్లు అవకాశం ఇచ్చినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అని మొట్టికాయలు వేసింది. కోర్టుతో ప్రభుత్వాలు ఇలాగే ప్రవర్తిసాయా అని గట్టిగా మందలించింది.
‘ఫాస్ట్’పై ఇవాళ జరిగిన విచారణ సందర్బంగా జీవోలో 1-11-1956 అనే తేదిని ఎందుకు పేర్కొన్నారో చెప్పాలని హైకోర్టు కోరింది. వివరణ ఇచ్చేందుకు సమయం పడుతుందని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది చెప్పటంతో కోర్టు సీరియస్ అయింది. ప్రభుత్వానికి ఇప్పటికే మూడు సార్లు గడువు ఇచ్చాము. మరో సారి పద్నాలుగు రోజుల సమయం ఇస్తున్నాం. ఈ సారి తప్పకుండా కౌంటర్ దాఖలు చేయాలి. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ప్రభుత్వాలు చేసే జీవోలన్నీ రాజ్యాంగానికి లోబడే ఉండాలని స్పష్టం చేసింది.
ఏమిటీ ఫాస్ట్ :
రాష్ర్ట విభజన తర్వాత తెలంగాణలో ఏర్పడ్డ టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్ షిప్పులు ఇచ్చే ఉద్దేశ్యంతో ఈ ‘ఫాస్ట్’ (Financial Assistance for Students of Telangana) అని పేరు పెట్టింది. అయితే కేవలం స్థానిక విద్యార్థులకే స్కాలర్ షిప్పులు దక్కాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం వివాదాస్పద నిబంధన తీసుకువచ్చింది. 01-11-1956కు ముందు తెలంగాణలో ఉన్న కుటుంబాల విద్యార్థులకు మాత్రమే ఫాస్ట్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. జీఓ పట్ల ఏపీ ప్రభుత్వం, ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. తెలంగాణ సర్కారు మాత్రం వెనక్కి తగ్గకపోవటంతో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. జీఓ వివాదాస్పదం కావటంతో తెలంగాణ విద్యార్థులకు ఇప్పటివరకు స్కాలర్ షిప్ దరఖాస్తు చేసుకునే అవకాశం రాలేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more