శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో దిగ్భ్రాంతికర పరాజయాన్ని మూటగట్టుకున్న ఆ దేశ మాజీ అధ్యక్షుడు రాజపక్సే ఎట్టకేలకు పార్టీ అద్యక్ష పదవి నుంచి కూడా తప్పుకోనున్నారు. శ్రీలంక ఫ్రీడం పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగి పార్టీ పగ్గాలను నూతన అధ్యక్షుడు సిరిసేనకు అప్పగించేందుకు అంగీకరించారు. పార్టీ ప్రదాన కార్యదర్శిగా గతంలో బాధ్యతలు నిర్వర్తించిన సిరిసేన.. ఆ తరువాత బహిష్కరణకు గురైయ్యారు. సుమారు దశాబ్ద కాలం తరువాత మళ్లీ సిరిసేనకు శ్రీలంక ఫ్రిడం పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలను చేపట్టనున్నారు,
ఇటీవల జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికలలో రాజపక్షే ఓటమిపాలవ్వడం, సిరిసేన గెలవడంతో, పార్టీ పగ్గాలను నూతన అధ్యక్షునికి అప్పగించాలని డిమాండ్ తెరపైకి వచ్చింది. అయితే ఇందుకు రాజపక్షే మద్దతుదారులు కూడా కిమ్మనకుండా మిన్నకుండటంతో ఆయన పార్టీ అధ్యక్ష పదవిని అప్పగించేందుకు సిద్దపడ్డారు. అయితే అంతకుముందు పార్టీ పగ్గాలను అప్పగించేందకు కొంత సంశయించిన రాజపక్షేను పార్టీ చీలనునందన్న వార్తల నేపథ్యంలో పార్టీ ముఖ్యుల వారించడంతో దిగివచ్చినట్లు తెలుస్తోంది.
మరోవైపు మహేంద్ర రాజపక్ష తన హాయంలో సాగించిన అవినీతి కార్యక్రమాలపై విచారణ జరపాలని నూతన ప్రభుత్వంలో భాగస్వామి అయిన మార్సిక్ట్ జనతా విముక్తి పెరమునా పార్టీ డిమాండ్ చేస్తూ పిర్యాదు చేసింది. రాజపక్షే సహా పార్టీ పదవులతో పాటు ప్రబుత్వంలో వున్న అయన కుటుంబ సభ్యులను విచారించాలని డిమాండ్ చేసింది. కాగా మహేంద్ర రాజపక్ష ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అయన సోదరుడు, బాసిల్ రాజపక్ష పార్టీ పదవికి రాజీనామా చేసి అమెరికాకు పయనమైనట్లు సమాచారం.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more