తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరీ ఎక్కువైన ముందుచూపుతో వెళ్తున్నారు. హైదరాబాద్ లో ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలియని మెట్రో సర్వీసు పనులు వేగవంతంగా జరుగుతున్న విషయం తెలిసిందే. పనులపై ఎల్ అండ్ టీ అధికారులతో సమీక్ష జరిపిన సీఎం, పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా మెట్రోను నగర శివార్లకు కూడా విస్తరించాలని సూచించారు. ఘట్ కేసర్, తిరుమలగిరి, హయత్ నగర్, పటాన్ చెరు ప్రాంతాలకు మెట్రోను విస్తరించాలన్నారు.
నగర శివార్లలో జనాభా పెరగటంతో పాటు, నగరం కూడా విస్తరిస్తున్న నేపథ్యంలో మెట్రోను మరిన్ని ప్రాంతాలకు అవసరం అయ్యేలా నిర్మించాలని సూచించారు. ఈ ప్రకటనతో ఎల్ అండ్ టీ అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. శివార్ల పనుల కోసం ఎవర్నీ పిలవకుండా తమకే అప్పగించటం పట్ల సంతోషంగా ఉన్నారు. అయితే ప్రస్తుత పనులు ఎప్పటికి పూర్తవుతాయో అధికారుల్లోనే స్పష్టత లేదు. భూ లభ్యత, ప్రజల నుంచి వస్తున్న విమర్శలు ఇతర అంశాల నేపథ్యంలో పనులు ఆలస్యం అవుతున్నాయి. ఈ తరుణంలో కొత్తగా విస్తరణ మొదలు పెడితే గతంలో కోట్ చేసిన రేటే వస్తుందా లేక, ప్రస్తుత డిమాండ్ ప్రకారం మాట్లాడుకునే అవకాశం ఉందా తెలియక మధనపడుతున్నారు.
ఇక నగర భద్రతపై సమీక్షలో భాగంగా సీసీ కెమెరాల సంఖ్యను పెంచాలని పోలిస్ కమిషనర్ కు ఆదేశాలు ఇచ్చారు. ఇందుకోసం ముంబైలో ఎల్ అండ్ టీ నిర్వహిస్తున్న సీసీ కెమెరాల పనితీరు పర్యవేక్షించాలని సూచించాడు. కమాండ్ కంట్రోల్ రూం నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. అదేవిధంగా జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ భవనాలన్నీ ఒకే చోట ఉండాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం ప్రతి జిల్లాలో 15 ఎకరాల స్థలాన్ని సేకరించాలన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more