పెషావర్ సైనిక పాఠశాల సోమవారం పున:ప్రారంభమైంది. సుమారు మూడున్నర వారాల తర్వాత విద్యార్థులు, టీచర్లు పాఠశాల ఆవరణలో అడుగుపెట్టారు. గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాలు వారు గుర్తు చేసుకున్నారు. తమ అప్తమిత్రులుగా వున్న వారు ఇక లేరని, వారు అనంత లోకాలకు తరలివెళ్లారని తలచుకుంటూనే విద్యార్థులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. పాఠశాల మూసివేసిన రోజున జరిగిన ఉగ్రకళిని వారు మర్చిపోలేకపోతున్నారు. ఒక వైపు పాఠశాల తెరిచారన్న ఆనందం వారిలో నెలకొన్నా.. మరోవైపు ఎప్పుడు ఏ ఘోరం జరుగుతుందోనన్న ఆందోళన మాత్రం ఆ పసిహృదయాలను వీడటం లేదు.
132 మంది అమాయక విద్యార్థులను అస్తిపంజరాలుగా మర్చిన ఘోరకళిని తలచుకుంటూ తొలి రోజు సాగిన పాఠశాలలో విషాధఛాయలకు సంబంధిచిన జ్ఞపకాలతో రోదనలు, సంతాపాలతోనే గడిచింది. ఎవరికి వారు తమ మిత్రుడు కానరాని లోకాలకు తరలివెళ్లారంటూ శోకసంధ్రంలో మునిగారు. విద్యార్థులతో పాటు పాఠశాల ఉపాద్యాయులు, బోధనేతర పిబ్బంది అంతా కలసి 148 మందిని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. పాఠశాల ఇవాళ తిరిగి ప్రారంభమైనా..ఎటు వైపు నుంచి ముప్పు పోంచివుందన్న విషయం తెలియని విద్యార్థులు భయం గుప్పెట్లోనే తొలిరోజును గడిపారు.
ఉగ్రవాదులు పెషావర్ సైనిక పాఠశాల మీద విరుచుకుపడి 132 మంది బాలలు సహా మొత్తం 148 మందిని మట్టుబెట్టిన ఘటన వారు స్మృతిపథం నుంచి తొలగిపోవడం లేదు. ఆ రోజు జరిగిన ఘోరకళిని వీక్షించి అదృష్టవశాత్తు బతికివున్న విద్యార్థులు ఇంకా భయాందోళన మధ్యే వున్నారు. భయం భయంగానే వారు పాఠశాలలో అడుగుపెట్టారు. యావత్ ప్రపంచాన్ని కలచివేసిన ఉగ్రవాది దారుణమారణకాండలో తమ సహవిద్యార్థులు రక్తపుమడుగుల్లా మారిన ఘటనను వారు మర్చిపోలేకపోతున్నారు.
ఉగ్రవాదుల అరాచకానికి రక్తపు మడుగుల్లా మారిన పాఠశాలను, సిరా ఒలకాల్సిన చోట రక్తపుటేరులై పారిన తరగతి గదులను పూర్తిగా శుభ్రం చేసిన పాఠశాల యాజమాన్యం.. విద్యార్థులకు మారణకాండ తాలుకు జ్ఞపకాలు గుర్తుకు రాకుండా ఎన్ని చర్యలు తీసుకున్నా అమయాక పసి హృదయాలకు తాకిన భయానక ఘటన ఎంత వద్దన్నా గుర్తుకు వచ్చింది. ఎట్టకేలకు తొలిరోజున భయం గుప్పెట్లోనే విద్యార్థులు పాఠశాలలో గడిపారు. ఈ దాడి అనంతరం పాకిస్థాన్లో భద్రత కారణాల రీత్యా విద్యాసంస్థలను మూసివేసి సెలవులు ప్రకటించారు. ఇప్పుడిప్పుడే మళ్లీ ప్రారంభమవుతున్నాయి. విద్యా సంస్థల వద్ద సాయుధులైన భద్రత సిబ్బందిని మోహరించారు.
పాకిస్థాన్ లో సరైన భద్రత కల్పించని పాఠశాలల్లో తరగతులను నిర్వహించేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతిని నిరాకరించింది. పాఠశాల చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడతో పాటు సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోకుంటే పాఠశాలల్లో తరగతులను నిర్వహించేందుకు అనుమతిని ఇవ్వబోమని పాకిస్థాన్ సమాచార శాఖా మంత్రి ముక్తాఖ్ గని చెప్పారు. ముఖ్యంగా పెషావర్ లోని పాఠశాలలన్నీ భద్రతా చర్యలను చేపట్టాలని ఆయన సూచించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు భద్రతా చర్యలు చేపట్టని పాఠశాలలకు అనుమతించబోమన్నారు. పాఠశాలల్లో భద్రతా చర్యలను అక్కడి పోలీసులు పరీక్షించి ఎన్ ఓ సీలు జారీ చే్స్తున్నారని, వాటిని పోందిన పాఠశాలలకే తరగతుల నిర్వహణకు అనుమతి ఇస్తున్నామని ముస్తాక్ గని చెప్పారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more