బాలీవుడ్ అగ్రనటిమణి కరీనా కపూర్.. విశ్వహిందూ పరిషత్కు చెందిన మహిళల మాగజీన్ హిమాలయ వాహిని కవర్ పేజీపై ఫోటోలకు ఫోజిచ్చారు. సాధారణంగా నటిమణులు పలు దేశ విదేశాలకు చెందిన మాగజీన్ కవర్ పేజీలపై ఫోజు ఇవ్వడం మామాలుగా జిరిగే విషయమే. అయితే కరీనా విషయంలో మాత్రం ఆమె ప్రమేయం లేకుండా.. అమె ఫోటోను మార్ఫింగ్ చేసి మరి కవర్ పేజీ పై వేయడం వివాదాస్పందంగా మారింది. దీనిపై కరీనాకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే కోర్టుకు వెళ్లవచ్చునని విశ్వహిందూ పరిషత్ తేల్చి చెబుతోంది. లవ్ జిహాద్కు ప్రచారానికి అమె ఫోటోను విశ్వహిందూ పరిషత్ వినియోగించుకుంది. లవ్ జిహాద్కు వ్యతిరేకంగా తమ సంస్థకు చెందిన మహిళా కార్యకర్తలు దీనిని వేశారని, దీని పైన కరీనాకు అభ్యంతరాలు ఉంటే న్యాయస్థానం ఉందని చెప్పారు. ఈ విషయంలో ఆమెకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే, కోర్టు తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని వీహెచ్పీ నేత ప్రకాశ్ శర్మ వ్యాఖ్యానించారు.
హిమాలయ వాహిని కవర్ పేజీపై కరీనా కపూర్ మార్ఫింగ్ ఫోటో వేయడానికి అమె సైఫ్ అలీఖాన్ అనే బాలీవుడ్ నటుడిని వివాహం చేసుకోవడమే కారణంగా వీహెచ్.పీ చెబుతోంది. కరినా ఫోటోకు బురఖా వేసినట్లు మార్పింగ్ చేసి.. ఆ ఫోటో కింద 'ధర్మాందరన్ సే రాష్ట్రాంతరన్' అని కాప్షన్ ఇచ్చారు. కరీనా హిందువుగా వుండి ముస్లింను పెళ్లి చేసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. అమె అంగీకరిస్తే.. హిందూవుగా మళ్లీ మారుస్తామని వీ.హెచ్.పీ నేతలు చెబుతున్నారు.
కరీనా కపూర్ అక్టోబర్ 16, 2012లో సైఫ్ అలీఖాన్ను వివాహం చేసుకుంది. సైఫ్ అలీఖాన్ను వివాహం చేసుకున్న అనంతరం కరీన తన పేరును కరీనా కపూర్ ఖాన్గా మార్చుకుంది. లవ్ జిహాద్ అంటూ హిందూ యువతులను ప్రేమిస్తున్నానని చెప్పి, పెళ్లి చేసుకొని మతం మార్చుకునేలా కొందరు ముస్లీంలు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపిస్తూ.. ఆ సంచికలో కరీనా కపూర్ ముఖ చిత్రాన్ని వేశారు. కాగా, ఈ చిత్రం పైన కరీనా కపూర్ ఇంకా స్పందించలేదు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more