శాస్త్రా సాంకేతిక రంగాల్లో నానాటికీ వస్తున్న విప్లవం.. మనిషి జీవితాన్ని అవసరముండే విదంగా అన్వయించుకుని వినియోగించుకోవాలని. లేని పక్షంలో ప్రమాదం బారిన పడటం ఖాయం. టెలికమ్యూనికేషన్స్ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల కారణంగా దేశంలో రమారమి ప్రతీ వ్యక్తి చేతిలోనూ సెల్ పోన్ వుంది. అయితే సెల్ పోన్ మాట్లాడే ప్రతీవారు తగిన జాగ్రత్తలు తీసుకోవలని మన ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూనే వున్నాయి. పెట్రోల్ బంకుల వద్ద, రైల్వే క్రాసింగ్ ల వద్ద గ్యాస్ లీకవుతున్న చోట, వాహనాలను నడుపుతూ సెల్ లో మాట్లాడకూడదని ప్రభుత్వాలు, పోలీసులు హెచ్చరిస్తూనే వున్నారు. అయినా వారి మాటలను పెడచెవిన పెట్టిన ఓ సాప్టవేర్ ఇంజనీర్ ప్రమాదాన్ని పసిగట్టలేక మాటల్లో పడి తన ప్రాణాలను అనంతవాయువుల్లో కలుపుకున్నాడు.
హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో జరిగిన ఈ ఘటనతో స్తానికంగా విషాదం చోటు చేసుకుంది. రైల్వేస్టేషన్లో ట్రాక్ దాటుతున్న యువకుడిని రైలు ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో సదరు యువకుడు అక్కడికక్కడే మరణించాడు. రైల్వేస్టేషన్లోని ప్రయాణికులు, సిబ్బంది వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. లీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకుని ... పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు సెల్ ఫోన్ మాట్లాడుతు రైల్వే ట్రాక్ దాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more