తెలుగురాష్ట్రాల్లోని వైష్ణవాలయాలు ముక్కోటి ఏకాదశి శోభను సంతరించుకుంటున్నాయి. ఏడాదికి ఒక్కసారి వచ్చే ముక్కోటి ఏకాదశి పర్వదినాన.. వేకువ జామున తొలి ఘడియల్లో స్వామి వారిని ఉత్తర ద్వారా దర్శనం ద్వారా దర్శించుకున్న భక్తులకు సకల పాపాలు తొలగుతాయన్న విశ్వాసం. దీంతో పాటు నూతన సంవత్సర కూడా ఇదే రోజున కలసిరావడం కాకతాళీయమే. ఈ నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో ఆలయాల దర్శనానికి రానున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో, తెలంగాణలోని భద్రాచలంలో పర్వదిన సందడి నెలకొది. తిరుమలేశుడి ఆలయంలో బుధవారం అర్ధరాత్రి దాటాక భక్తుల కోసం ఉత్తర ద్వార దర్శనం ప్రారంభం కానుంది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని బుధవారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం అర్ధరాత్రి దాకా వైకుంఠ వాకిలిని తెరిచి ఉంచనున్నారు. కాగా.. గురువారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (ఆలయశుద్ధి) కార్యక్రమం నిర్వహించారు.
మరోవైపు.. భద్రాచలంలో ఇవాళపవిత్ర గోదావరి నదిలో శ్రీసీతారామచంద్రస్వామికి హంసాలంకృత లాంచీపై తెప్పోత్సవం నిర్వహించనున్నారు. గురువారం స్వామివారు మహావిష్ణువు అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. గరుడ వాహనరూఢుడు కానున్నారు. ఉత్తర ద్వార దర్శనానికి, ఈ వేడుకలను తిలకించేందుకు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఇంద్రకరణ్రెడ్డి, జోగు రామన్న రానున్నారు.
అటు ప్రసిద్ద పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహ స్వామి భక్తజనులకు వైకుంఠ ద్వార దర్శనం ఇవ్వనున్నారు. మహిమాన్విత లక్ష్మీనరసింహుల తూర్పు ద్వార దర్శనం గురువారం వేకువజామున 6.49 నిమిషాలకు జరుగుతుంది. అదే విధంగా ఆలయ ప్రాశస్త్యం కోసం పాంచరాత్రగమ శాస్త్రరీతిలో నిర్వహించే అధ్యయనోత్సవాలకు శ్రీకారం జరుగుతుంది. ఈ ఉత్సవాలు 6 రోజులపాటు విశేష అలంకర పొరప్పాటు సేవలతో సంప్రదాయరీతిలో నిర్వహిస్తారు. జనవరి 1న నూతన సంవత్సర వేడుకలు, పవిత్ర వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం.అధ్యయనోత్సవాల ప్రారంభం సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలుకగుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more