భూసేకరణ చట్టంలో కీలక సవరణలకు కేంద్రమంత్రివర్గం సోమవారం ఆమోద ముద్రవేసింది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర క్యాబినెట్.. భూసేకరణ చట్టంలో మార్పులతో పాటు పలు మురికివాడలలోని నివాసాలను గుర్తింస్తూ అమోదముద్ర వేసింది. రైతుల నుంచి భూములు సేకరించే క్రమంలో వారికి ఇచ్చే పరిహారాంతో పాటు ప్రత్యామ్నాయ భూములను కూడా చూపాలన్న సవరణ సహా పలు సవరణలకు కేంద్ర మంత్రిమండలి అమోదం తెలిపిందని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.
సోమవారం దిల్లీలో సమావేశమైన కేంద్రమంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుందన్నారు. దీంతో భూసేకరణ చట్ట నిబంధనలు సరళతరమవుతాయన్నారు. ఫలితంగా పరిశ్రమలకు భూసేకరణ సులువు కానుందని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వరంగ సంస్థల్లో ప్రణాళికేతర వ్యయంపై కూడా చర్చించినట్లు చెప్పారు. బొగ్గు గనుల అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లు వెల్లడించారు. అలాగే ఇనుపఖనిజంతో సహా ఇతర ఖనిజాల గనుల వేలానికి సంబందించిన ఆర్డినెన్స్ లను కూడా ఆమోదించిందని తెలిపారు.
ఈ ఖనిజాల వేలంలో జాప్యం వల్ల వందలాది కోట్ల డాలర్ల పెట్టుబడులు, ప్రాజెక్టులు నిలిచి పోతున్నాయన్నారు. భూ సేకరణ చట్టంలో ఆంక్షల కారణంగా రైళు, ఉక్కు, మైనింగ్ , రోడ్ల విస్తరణ వంచి రంగాల్లో రూ. 20 లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్టులు నిలిచిపోయాయని కేంద్ర కేబినెట్ అభిప్రాయపడిందన్నారు. ఈ బిల్లు పారిశ్రామిక విస్తరణకు, భూ ఒప్పందాలకు అవరోధంగా మారిందని పలు కంపెనీలు తెలిపాయని... 2013 భూ సేకరణ చట్టం ఈ ఏడాది జనవరి నుంచి అమలులోకి వచ్చింది. ఇక ముందు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ప్రాజెక్టులకు భూమి యజమానుల ఆమోదం తప్పని సరి అన్న నిబంధనను తొలగిస్తూ చట్టంలో మార్పులు చేశామన్నారు. 50 శాతం భూ యజమానుల ఆమోదం లభిస్తే ప్రాజెక్టు ఆమోదం పొందే వీలు కలుగుతుందన్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more