ఎప్పటినుండో మన దేశానికి కొరకరాని కొయ్య గా మారి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇబ్బంది చేస్తున్న దావూద్ ఇబ్రహీం ఆచూకి దొరికినట్లు చెప్తున్నాయి కొన్ని వర్గాలు. ఇప్పటికే భారత్ లో కొన్ని విధ్వంసాలకు దావుదే కారణం అని తెలిసినప్పటికీ అతన్ని వెతికిపట్టు కోవటం మన దేశానికి తీవ్ర సంకటంగా మారింది.
ముంబై పేలుళ్లకు సంబంధించి దావూద్ హస్తం ఉన్నట్లు తెలిసిన కాని మన భారత్ అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించినా పాకిస్తాన్ సహాయం తో ఇప్పటికి పలు దేశాలకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు.
ఇప్పటికే పలు దేశాల మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆచూకీ కనుగొన్నట్లే అని కొన్ని అంశాలను చూస్తే తెలుస్తుంది. పాకిస్థాన్లోని కరాచీ నగర శివారు ప్రాంతం క్లిఫ్టన్ నుంచి దావూద్ ఫోన్లో మాట్లాడినప్పటి సంభాషణలను ఓ పాశ్చాత్య నిఘా సంస్థ రికార్డు చేసింది. ఆస్తి ఒప్పందానికి సంబంధించి దుబాయ్లో ఉంటున్న ఓ వ్యక్తితో దావూద్ మాట్లాడిన సమయంలో సంభాషణల్ని రికార్డు చేశారు. రెండు దశాబ్దాల క్రితం దావూద్ పాకిస్థాన్ పారిపోయిన తర్వాత భారత నిఘా సంస్థలు అతని ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.
దీన్ని బట్టి ఇప్పటికి దావూద్ పాకిస్తాన్ లోనే తల దాచుకుంటున్నాడని నిఘా సంస్థలకు స్పష్టం అయ్యింది. ఈ ఏడాది మొదట్లో భారత్కు దావూద్ను అంతం చేసే అవకాశం వచ్చినట్టు ఇటీవల కొన్ని వార్తలు వచ్చాయి. భారత్ కమెండోలు దావూద్ ను టార్గెట్ చేసినపుడు, కొన్ని క్షణాలు ముందు భారత్కు చెందిన ఓ వ్యక్తి ఫోన్ చేసి కాల్చొద్దని ఆదేశాలు జారీ చేసినట్టు కథనాలు వెలువడ్డాయి. ఏది ఏమైనప్పటికీ భారత్ దావూద్ ఆచూకి తెలిసినా కొన్ని సార్లుఅతన్ని ఏమి చేయలేకపోతుందని దీనికి అంతర్జాతీయ ఒత్తిల్లే కారణమని కొన్ని వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాని ఇప్పటికే చాల దేశాలు అతన్ని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చిన సంగతి తెలిసిందే.
హరికాంత్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more