రజినీకాంత్ వీరాభిమాని ఒకరు సూపర్ స్టార్ సినిమా చూస్తూనే చనిపోయిన ఘటన తమిళనాడులో జరిగింది. కోయంబత్తూరు సమీపంలోని చెట్టిపాళ్యంకు చెందిన రాజేంద్రన్ (58) అనే వ్యాపారి రజినీకి వీరాభిమాని. క్యాన్సర్ తో బాధపడుతున్న ఈయన చికిత్స తీసుకుంటున్నారు. డాక్టర్లు ఇంటినుంచి బయటకు వెళ్లవద్దని చెప్పారు. అయితే అభిమాన హీరో సినిమా విడుదల కావటంతో.., సినిమా చూడాలని ఉన్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పాడు. వారు వద్దని సూచించారు. కుటుంబ సభ్యుల మాట వినకుండా శుక్రవారం రాత్రి ఇంట్లోంచి వచ్చి.., బస్సు ఎక్కి కోయంబత్తూరు చేరుకున్నాడు.
స్థానికంగా సినిమా ఆడుతున్న శాంతి థియేటర్ లో సెకండ్ షో టికెట్ తీసుకున్నాడు. సినిమా అంతా పూర్తయ్యాక.., అర్ధరాత్రి 1.25 సమయంలో థియేటర్ క్లీనింగ్ కోసం హాలులోకి వచ్చిన సిబ్బంది. రాజేంద్రన్ కుర్చీలో ఉండటం గమనించి... నిద్రపోయినట్లు భావించారు. దగ్గరకు వచ్చి పిలిచినా లేవకపోవటంతో.., చేయితో తట్టారు. ఎంత ప్రయత్నించినా.. కళ్లు తెరవకపోవటంతో థియేటర్ యజమానికి సమాచారం ఇచ్చారు. మృతుడిని పరిశీలించిన మేనేజర్ పోలిసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి వచ్చిన పోలిసులు... రాజేంద్రన్ ను చూసి చనిపోయినట్లు ధృవీకరించారు. మృతదేహాన్ని కోయంబత్తూరు మెడికల్ కాలేజి ఆస్పత్రికి తరలించారు.
సెలైన్ ఎక్కించేందుకు నరానికి పెట్టే డ్రిప్ ట్యూబ్ రాజేంద్రన్ చేతికి ఉండటంతో.., చికిత్స మద్యలోనే సినిమా చూసేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అటు ఇంటర్వెల్ సమయంలో రాజేంద్రన్ చాలా ఉల్లాసంగా ఉన్నాడనీ.., పాప్ కార్న్ కూడా తెచ్చుకుని తినటం చూశానని థియేటర్ మేనేజర్ కర్నన్ తెలిపాడు. కుటుంబ సభ్యులు మృతదేహం స్వాధీనం చేసుకున్నారు. అటు పోలిసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more