గత సార్వత్రిక లోక్ సభ ఎన్నికలలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఒక ప్రభంజనాన్ని సృష్టించిన బి.జె.పి.., అదే జోరును కొనసాగిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇటీవల పలు దశలలో జరిగిన రెండు రాష్ట్రాల(జమ్మూ కాశ్మీర్ మరియు జార్ఖండ్) ఎన్నికలలో బి జె పి తన సత్తా చూపించింది. జమ్మూ కాశ్మీర్ లో బి జె పి కి చెప్పుకోదగ్గ ఫలితాలు వచ్చాయి. బి.జె.పి రెండవ స్థానం లో నిలిచింది. ప్రస్తుత అధికార నేషనల్ కాన్ఫరెన్సు పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. రాష్ట్ర ఫలితాలలో బి.జె.పి 25 స్థానాలు సాధించగా, పీడిపి పార్టీ 28 స్థానాలు సాధించింది కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం మెరుగుపడలేదు. ఆ పార్టీ 12 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నేషనల్ కాన్ఫరెన్సు పార్టీ 15 స్థానాలలో గెలిచి, మిగిలిన స్థానాల్లో అతి ఘోరమైన పరాభావాన్ని చవిచూసింది. జమ్మూకశ్మీర్ లో పీడీపీకి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ ముందుకు వచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం పీడీపీకి వస్తే మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్ ఇప్పటికే ప్రకటించారు. గతంలో పీడీపీ, నేషనల్ కాన్ఫెరెన్స్ తో జట్టు కట్టిన విషయాన్ని ఆయనీ సందర్భంగా గుర్తు చేశారు.బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలవబోమని స్పష్టం చేశారు. పీడీపీ కోసం తమ పార్టీ తలుపులు తెరిచివున్నాయని చెప్పారు.
జార్ఖండ్ లో బి జె పి తన సత్తా చాటింది.అక్కడ కాంగ్రెస్ 6 స్థానాలతో సరిపెట్టుకోగా, బి జె పి 40 స్థానాల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. కాని ఆ పార్టీ కీలక నేత అర్జున్ ముండా ఓడిపోవటం ఆ పార్టీ కి చేదు అనుభవం. జె ఎం ఎం పార్టీ 19 స్థానాల్లో గెలిచి పరువు దక్కించుకుంది. జె వి ఎం పార్టీ 8 స్థానాల్లో విజయం సాధించింది. ఏది ఏమైనా రెండు రాష్ట్రాల్లో బి జె పి తన ప్రాబల్యాన్ని చాటుకుంది.
హరికాంత్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more