తమిళ నాడులో బిజెపి ఆకర్ష కొనసాగుతుంది. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో కొందరు సినీ ప్రముఖులు, కొందరు రాజకీయ నేతలు బిజెపి పంచన చేరిపోతున్నారు. ఇప్పటికే తమిళ నాటనే కాకా దక్షిణాదిలోనే మంచి పేరు ఉన్న సుప్రసిద్ధ నటుడును దేశ ప్రధానే మంత్రే స్వయంగా సంప్రదించినట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన సున్నితంగా తిరస్కరించినప్పటికీ అమిత్ షా ను ఆ విషయం లో చొరవ తీసుకోవాల్సిందిగా సూచించినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏది ఏమైనా తమిళ నాడు లో ఈ బిజెపి ఆకర్ష అందరికి అమిత ఆసక్తి ని కలిగిస్తుంది. త్వరలోనే తమిళ రాజకీయాల్లో తనదైన శైలిలో చక్రం తిప్పిన మరో ప్రముఖ రాజకీయ నేత కూడా బిజెపి లో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నరేంద్ర మోడీ ఇప్పటికే అమిత్ షా కు పలు సూచనలు చేసినట్లు పార్టీ వర్గాలు గుస గుసలాడుకుంటున్నాయి. ఏది ఏమైనా నరేంద్ర మోడీ సూచనలతో అమిత్ షా ఎత్తులతో తమిళ నాట బిజెపి బలంగా తయారవుతున్నదని స్థానిక బిజెపి వర్గాలు భావిస్తున్నాయి. త్వరలో జరగనున్న ఎన్నికలలో బిజెపి తన ఆధిక్యాన్ని కనబరిచే అవకాశలున్నట్లు రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.
నిన్న తమిళ నాడులో పర్యటించిన అమిత్ షా పర్యటన సందర్భంగా కొందరు నేతలు కూడా బిజెపి లో చేరినట్లు తెలుస్తుంది. తమిళనాడులో మరో ప్రముఖ నటుడు బిజెపిలో చేరారు. నెపోలియనే అనే ప్రముఖ నటుడు డి.ఎమ్.కె.కి గుడ్ బై చెప్పి బిజెపి అద్యక్షుడు అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరారు. ఆయన డి.ఎమ్.కె.తరపున కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేశారు. పార్టీ అధినేత కరుణానిధి కుమారుడు అళగిరి కి అనుచరుడుగా ఉన్నారు. అళగిరిని పార్టీనుంచి సస్పెండ్ చేశాక ఆయన మద్దతుదారులు వేరే పార్టీలలోకి వెళుతున్నారు. ఈ నేపధ్యంలో నెపోలియన్ మాట్లాడుతూ డి.ఎమ్.కె.గాడి తప్పిందని వ్యాఖ్యానించారు. ఇంకోదరు ప్రముఖులు కూడా బిజెపి లోకి రావటానికి ఆసక్తి కనబరుస్తున్నారని తమిళ నాట బిజెపి మోడీ మార్గదర్శకత్వం లో బలమైన పార్టీగా అవతరిస్తుందని చెప్పారు.
హరి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more