చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్-జూన్ మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాజధానిలో తాత్కాలిక సీఎం క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు టీడీపీఎల్పీ సమావేశంలో చంద్రబాబు స్పష్టం చేశారు. రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఏపీ పాలనను కొత్త రాష్ట్రం నుంచి సాగించాలన్న అంశం చర్చకు వచ్చింది. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ కొత్త రాజధానిలో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టి, కొత్త శాఖలను అక్కడికి తరలిద్దామని తెలిపారు.
వీలైనంత త్వరలో ఏపీ నుంచి పాలన కొనసాగించేలా కృషి చేద్దామన్నారు. ఇకపై హైదరాబాద్ రాజకీయ రాజధానిగా మాత్రమే ఉంటుందని బాబు తెలిపారు. జనవరి నుంచి ప్రతీ శనివారం శాసనసభ్యులకు సమయం కేటాయించాలని చంద్రబాబు నిర్ణయించారు. మంత్రులు కూడా ఆ సమయంలో శాసనసభ్యులకు అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. అలాగే ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలపైనా సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. రుణమాఫీ, పెన్షన్ల పథకాన్ని ప్రచారం చేసుకోలేకపోతున్నామని, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలను సీఎం ఆదేశించారు. కొందరు రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఏపీలో ఆత్మహత్యలపై సమాచారం తెప్పిస్తున్నామన్నారు. బాధిత కుటుంబాలకు అప్పులు ఉంటే పూర్తిగా మాఫీ చేసి కొంత ఆర్థిక సాయం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమావేశంలో వెల్లడించారు.
బినామీలకు రుణమాఫీ వార్తలపై ఎమ్మెల్యేలు దృష్టి సారించాలని సూచించారు. 50 గజాలలోపు స్థలాలను క్రమబద్దీకరించే యోచనలో ఉన్నట్లు చంద్రబాబు తెలిపారు. వైసీపీ నేతలు తూ.గో జిల్లాకు వెళ్లి పోలవరం నుంచి నీళ్లను రాయలసీమకు ఎలా తరలిస్తారని ప్రశ్నిస్తున్నారని, అదే విషయాన్ని రాయలసీమకు వెళ్లి చెప్పగలరా అన్ని సీఎం ప్రశ్నించారు. పోలవరం విషయంలో వైసీపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని చంద్రబాబు నాయుడు అన్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more