రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని, ఈ నెల 8 నుంచి శీతాకాల సమావేశాలకు వెళ్లనున్న తరుణంలో మహారాష్ట్రలోని తొలి బీజేపి ప్రభుత్వం.. రాష్ట్రవాసులకు కొత్త సంవత్సరం సందర్భంగా షాక్ ఇవ్వనుంది. మహారాష్ట్రలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు, ఆంకాంక్షలు పెట్టుకున్న మహారాష్ట్రవాసులకు న్యూ ఇయర్ సందర్భంగా చేదు వార్తను అందించనుంది. మహారాష్ట్రలో గత కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వం గృహ, వాణిజ్య వినియోగదారులకు కల్పించిన విద్యుత్ రాయితిని ఎత్తివేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు తొమ్మిది నెలల ముందు గత కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వం రాజధాని సహా శివారు ప్రాంత వాసులకు విద్యుత్ రాయితీని ప్రకటించింది. సుమారు 8 వేల 472 కోట్ల రూపాయల రాయితీని కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు గాను ప్రతి నెల 706 కోట్ల రూపాయలను 12 నెలల పాటు విద్యత్ రెగ్యులేటరీ కమీషన్ కు ఇచ్చందుకు అంగీకరించింది. ఈ రాయితీ వచ్చే ఏడాది ఫ్రిబవరితో ముగియనున్న తరుణంలో సుమారుగా పద్నాలుగు వందల 12 కోట్ల రూపాయల మినహాయింపును ప్రభుత్వ ఎత్తివేస్తూ నిర్ణయిం తీసుకుంది
దీంతో విద్యుత్ చార్జీలు 20 శాతం మేర పెరగనున్నాయి. వచ్చే ఏడాది జనవరి మాసం నుంచి కోత్తగా పెరిగిన విద్యుత్ చార్జీలు అమల్లోకి రానున్నాయి. దీనికి తోడు మహారాష్ట్ర విద్యుత్ రెగ్యూలేటరీ కమీషన్ విద్యుత్ చార్జీలను సుమారు 15 శాతం మేర పెంచాలని ప్రభుత్వానకి ఇప్పటికే నివేదికలను అందజేసింది. దీనికి కూడా పెడ్నవిస్ ప్రభుత్వం అమోదం తెలపడంతో మహారాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ దరలు 35 శాతం పెరగనున్నాయి. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే తమకు బీజేపి ప్రభుత్వం కొత్త సంవత్సరం సందర్బంగా వాతలను ఇచ్చిందని మహారష్ట్ర వాసులు ప్రబుత్వ నిర్ణయంపై మండిపడుతున్నారు.
కాగా మహారష్ట ముఖ్యమంత్రి దేవెంద్ర పెడ్నవిస్ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు. రాయితీలతో పరిశ్రమలకు నష్టం వస్తుందంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆద్వర్యంలో నడుస్తున్న విద్యుత్ ప్రాజెక్టులు మరింత ఆదాయన్ని ఆర్జిస్తే.. వాటి ఫలాలు వచ్చే ఏడాది వచ్చే టారిఫ్ పై ప్రభావాన్ని చూపుతాయన్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more