భారత యుద్దరంగంలో కొత్త యుద్ద విమానాలు రాబోతున్నాయి. పూర్తి స్వేదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందుతున్న తక్కువ బరువుతో వుండే తేజస్ యుద్దవిమానాలను భారత్ సిద్దం చేస్తున్నట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. లోక్ సభలో ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే 20 నుంచి 30 నూతన యుద్ద విమానాలు భారత రక్షణ రంగంలోకి రానున్నాయని తెలిపారు. వయోభారంతో ఇప్పటికీ సేవలందిస్తున్న మిగ్ యుద్ద విమానాల స్థానంలో నూతన యుద్ద విమానాలు సేవలందిస్తాయని తెలిపారు.
రక్షణ పరిశోధనా, అభివృద్ది సంస్థ డీఆర్డీఓ తేజస్ యుద్దవిమానాల తయారీలో నిమగ్నమైందని తెలిపారు. అవి పరీక్షలు విజయవంతం కాగానే మిగ్ యుద్దం విమానాల స్థానంలో తేజస్ లను భర్తీ చేస్తామన్నారు. ఐదో తరంలో వస్తున్న నిగూడ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన దాడులను మిగ్ యుద్దవిమానాలు గుర్తించే అవకాశం లేదని, రాడర్లకు కూడా అందకుండా అత్యంత పై నుంచి ఎగరడంలో తేజ్ యుద్ద విమానాలు దాడులు చేపడతాయన్నారు. జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో బారాముల్లా జిల్లా యూరీ సెక్టార్లో జరిగిన ఎన్కౌంటర్పై కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ లోక్ సభలో ప్రకటన చేశారు. దాడికి పాల్పడ్డ ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చామని వెల్లడించారు.
బంకర్లో దాగిన మిగిలినవారిని కూడా ఏరివేస్తామని పారికర్ చెప్పారు. తీవ్రవాదుల దాడిలో ఏడుగురు జవాన్లు, ముగ్గురు పోలీసులు మరణించినట్టు తెలిపారు. ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరుపుతూ, యూరీ సెక్టార్లోని ఓ బంకర్లోకి చొరబడ్డారు. వారిని బయటకు రప్పించడానికి సైనికులు రంగంలోకి దిగారు. బంకర్లో భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఎంతమంది ఉన్నారన్న విషయాన్ని అధికార్లు వెల్లడించలేకపోతున్నారు. ఉగ్రవాదులు ఉన్న బంకర్ను దిగ్బంధం చేసినట్లు చెప్పారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more