దేశంలోనే అత్యున్నత ధర్యాప్తు సంస్థ సీబీఐకి డైరెక్టర్ హోదా అంటే అందర్నీ హడలెత్తించాల్సిన పదవి. అవినీతి, అక్రమాలను నిగ్గుతేల్చటంలో సీబీఐకి ప్రత్యేక గుర్తింపు ఉంది. కాని ఇదే సమయంలో పాలకుల చేతిలో కీలుబొమ్మ అనే చెడ్డపేరు కూడా వచ్చింది. ప్రధానంగా తాజా మాజి డైరెక్టర్ రంజిత్ సిన్హా పదవీకాలంలో ఈ ఆరోపణలు, విమర్శలు తీవ్రం అయ్యాయి. సుప్రీంకోర్టే స్వయంగా చాలాసార్లు రంజిత్ సిన్హా వ్యవహారంను తప్పుబట్టింది. చివరకు పదవినుంచి వైదొలిగే సమయంలో ‘నేను చెప్పుకోవటానికి ఏ మంచి పనీ చేయలేదు’ మీ ఇష్టం వచ్చింది రాసుకొండి.., ఇప్పటికే నాపై చాలా బురద వేశారు’ అని మీడియాతో అన్నారు. రంజిత్ మాటల్లో పశ్చాత్తాపంతో పాటు .., తప్పు చేయకపోయినా నిందలు మోపారనే బాధ కూడా కన్పిస్తోంది. ఇలా పదవీ కాలంలో ఎన్నో విమర్శలు ఆరోపణలు ఎదుర్కుని చివరి సమయంలో కూడా కోర్టుచే అక్షితలు వేయించుకున్న రంజిత్ సిన్హా గురించి తెలుసుకుందాం.
రంజిత్ సిన్హా 1974 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్. పోలిస్ గా డీజీపీ, ఐటీబీపీ, రైల్వే ప్రొటెక్షన్ పోర్స్, సీఆర్పీఎఫ్ సహా ఇతర విభాగాల్లో సేవలు అందించారు. చివరగా యూపీఏ హయాంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సూచన మేరకు అప్పటి యూపీఏ ప్రభుత్వం ఈయన్ను సీబీఐ డైరెక్టర్ గా ఎంపిక చేసింది. అయితే దీనిపై బీజేపి సహా ఇతర రాజకీయ పార్టీలతో పాటు పలువులు సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా అభ్యంతరం తెలిపారు. అలా ఆది నుంచే అనుమానాలు, ఆరోపణలు, విమర్శలు, వివాదాలతో సీబీఐ డైరెక్టర్ గా కొనసాగారు. ఈ పదవిలో ఉండగా ఎన్నో కీలక కేసులు ధర్యాప్తు చేయాల్సి వచ్చింది. అయితే దురదృష్టవశాత్తు చాలా కేసుల్లో ఆరోపణలు ఎదుర్కున్నారు.
బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ ను జైలు పాలు చేసిన దాణా కుంభకోణంపై విశ్వాస్ ధర్యాప్తు చేసిన నివేదికను కోర్టుకు అందించకుండా, జోగిందర్ సింగ్ తో కలిసి నివేదికను మార్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని విశ్వాస్ స్వయంగా పాట్నా హైకోర్టుకు చెప్పటం తీవ్ర కలకలం రేపగా.., సిన్హాను ఈ కేసు ధర్యాప్తు నుంచి కోర్టు తప్పించింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో పనిచేసిన సమయంలోనూ మమతతో వివాదం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక దేశంలోనే సంచలనం రేపిన కోల్గేట్ కుంభకోణం దర్యాప్తులో సీబీఐ పనితీరును ఏకంగా సుప్రీంకోర్టు తప్పుబట్టింది.
కేసు ధర్యాప్తు నివేదికను కోర్టుకు సమర్పించేముందు నాటి న్యాయ శాఖ మంత్రి అశ్వనీకుమార్ కు చూపించినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రధాని సహా ప్రభుత్వ పెద్దలందరికి కుంభకోణంలో పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న తరుణంలో నివేదికను మంత్రికి చూపించటంపై దుమారం రేగింది. ఈ విషయంపై సుప్రీం కోర్టు ‘సీబీఐ పంజరంలో చిలకలా మారింది’ అని ఘాటుగా స్పందించింది. ఈ మాటలను సిన్హా కూడా అంగీకరించారు. ధర్యాప్తులో ప్రభుత్వాల జోక్యం, ఒత్తిడులు ఉంటున్నాయని చెప్పారు. దీంతో వెంటనే స్పందించిన యూపీఏ2 సర్కారు.., సీబీఐకి అదనంగా ప్రత్యేక అధికారాలు, మరింత స్వయం ప్రతిపత్తి కల్పించటంపై జీఓఎంను ఏర్పాటు చేసింది.
ఇక యూపీఏ ప్రభుత్వ హయాంలో వెలుగు చూసిన మరో స్కాం రైల్వే బోర్డు అక్రమాల ధర్యాప్తులోనూ రంజిత్ సిన్హాపై ఆరోపణలు వచ్చాయి. అప్పటి రైల్వే శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సాల్ కి ప్రమేయం ఉన్నట్లు సీబీఐ ఆధారాలు సేకరించింది. ఆ తర్వాత బన్సాల్ కు అవినీతిలో ప్రమేయం లేదని రంజిత్ సిన్హా ప్రకటించారు. ఇలా సీబీఐ డైరెక్టర్ గా వరుసగా వివాదాలు, విమర్శలు ఎదుర్కున్నారు. ధర్యాప్తు సంస్థపై అప్పటివరకు ఉన్న గౌరవం, నమ్మకంను కావాలనో లేక మరో కారణం చేతనో పోగొట్టుకున్నారు. పదవీకాలం చివరి దశలో కూడా సుప్రీంకోర్టు నుంచి విమర్శలు ఎదుర్కుని.., వివాదాల సీబీఐ డైరెక్టర్ గా మచ్చతెచ్చుకున్నారు.
రంజిత్ సిన్హా పదవీకాలం ముగియటంతో సీబీఐ కొత్త డైరెక్టర్ గా 1979 ఐపీఎస్ బ్యాచ్, బీహార్ కేడర్ కు చెందిన అనిల్ సిన్హాను కేంద్రం నియమించింది. ప్రధాని మోడి, చీఫ్ జస్టిస్ దత్తు, కాంగ్రెస్ లోక్ సభ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ఈ నియామకంపై చర్చించి తుది నిర్ణయం తీసుకోగా.., మంగళవారం అర్ధరాత్రి అనిల్ నియామకంపై జీవో వెలువడింది. వచ్చే రెండేళ్ల పాటు సీబీఐ డైరెక్టర్ గా అనిల్ కొనసాగుతారు. ఈయనైనా సీనియర్ లా కాకుండా.., సంస్థ పేరు ప్రతిష్ట పెంచేలా పనిచేయాలని ‘తెలుగు విశేష్’ కోరుకుంటోంది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more