సాధరణంగా ఎవరి కొడుకైనా పాలన సాగిస్తుంటే.. తండ్రి అది చూసి గర్వ పడతారు. కానీ ఆయన మాత్రం కొడుకైనా సరే.. పాలన సరిగ్గా సాగించకపోతే.. అక్షింతలు వేస్తారు. అది కూడా అందరి సమక్షంలో మీడియా ముఖంగానే. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా..? ఆయనే సమాజ్వాది పార్టీ జాతీయ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్. తన తనయుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు పాలనపై ఆయన మరోమారు చురకలు అంటించారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు నత్త నడకన సాగడంపై తనయుడికి అక్షింతలు వేశారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి వదిలేస్తున్నారే తప్పా వాటిని పూర్తి చేయడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
'రాష్ట్రంలో ఎన్నో సంక్షమ పథకాలున్నాయని అభివర్ణించిన ఆయన అవి ప్రజలకు సక్రమంగా అందడం లేదని విమర్శించారు. ప్రభుత్వం పథకాలను ప్రవేశపెడితే చాలదని, వాటిని ప్రజలకు సరిగ్గా అందేలా చేయాలని సూచించారు. ఇక రాష్ట్రంలో అభివృద్ది పనులు కూడా నెమ్మదిగా జరుగుతున్నాయి చురకలంటించారు. రాష్ట్రంలో అనేక శంకుస్థాపనలు ముఖ్యమంత్రి చేస్తున్నారని వింటున్నానని, అయితే తర్వాత వాటిని పూర్తిచేసినట్టు ఎక్కడా కనబడడం లేదని ఎద్దేవా చేశారు. అభివృద్ధి పనులు పూర్తిచేసి ప్రారంభోత్సవానికి తనను పిలుస్తారని ఎదురుచూస్తున్నాను' అని ములాయం అన్నారు.
తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ది ఇలా నత్త నడకన సాగలేదని అన్నారు. శంకుస్థాపన చేసినప్పుడే ప్రారంభోత్సవ తేదీని ప్రకటించానని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి క్యాబినెట్లో వున్న పనిచేయని మంత్రులకు కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. పనిచేయని వారిని, అభివృద్ది పనులపై పర్యవేక్షణ లేని వారిని ఇంటికి పంపిస్తామని పరోక్షంగా హెచ్చరించారు. 302 కిలోమీటర్ల లక్నో-ఆగ్రా ఎక్స్పెస్ కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ములాయం తనయుడు అఖిలేష్ యాదవ్ కూడా పాల్గొన్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more