ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణంకోసం తమ భూములను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వబోమని గుంటూరుజిల్లా తుళ్లూరు, మంగళగిరి మండలాలకు చెందిన రైతులు తిరుగుబాటు చేయడంతో.. నేరుగా సీఎం చంద్రబాబుకు రంగంలోకి దిగాల్సి వచ్చింది. మంగళవారం సాయంత్రం ఆయన రాజధాని ప్రాంత రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగానే మాట్లాడిన ఆయన రైతులందరికీ ‘బంపర్’ ఆఫర్ ప్రకటించారు. భూములిచ్చే రైతులందరినీ పారశ్రామికవేత్తలుగా తయారుచేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగానే బాబు మాట్లాడుతూ.. భూసమీకరణకు సానుకూలంగా ఉన్న రైతులు భయపడాల్సిన పనిలేదన్నారు. భూములిచ్చిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని, వారిని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. భూములు అప్పగించే రైతులను పారిశ్రామికవేత్తలుగా తయారుచేస్తానని అన్నారు. నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇప్పించి రైతులకు ఉజ్వల భవిష్యత్ అందిస్తామని ఆయన తెలిపారు. కేంద్రం నుంచి వచ్చే పరిశ్రమలన్నీ తొలుత రాజధాని ప్రాంతంలోనే ఏర్పాటు చేస్తామని పేర్కొన్న ఆయన... భూములిచ్చే కుటుంబాల్లో నిరుద్యోగులుంటే వారికి ఉద్యోగవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.
చంద్రబాబు ఇచ్చిన ఈ హామీలతో సంతృప్తి చెందిన రైతులు.. ‘‘తమ ప్రాంతానికి ఏపీ రాజధాని వచ్చినందుకు తమకెంతో గర్వంగా వుందని’’ బాబుతో అన్నారు. రాజధాని నిర్మాణం కోసం తమ భూములు ఇవ్వడానికి సిద్ధమని పేర్కొన్న రైతులు... పరిహారం కింద కొందరు తమకు 1200 గజాల స్థలం ఇవ్వాలంటూ సీఎంను కోరారు. మరికొందరు 1200 గజాల స్థలంతోపాటు 200 గజాల వాణిజ్యభూమిని కూడా ఇవ్వాలన్నారు. ఇందుకు బాబు కూడా సరేనన్నట్లు అంగీకారం తెలిపారని సమాచారం! ఏదైతేనేం.. మొత్తానికి రైతుల మనస్సులను గెలుచుకొన్న బాబు రాజధాని నిర్మాణ అడ్డంకులను సమర్థవంతంగా ఎదుర్కోగలిగారని విశ్లేషకులు అనుకుంటున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more