ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సింగపూర్ పర్యటనకు వెళ్ళారు. తన బృందంతో కలిసి మంగళవారం సాయంత్రం బాబు బయల్దేరారు. సీఎం అయిన తర్వాత చేస్తున్న తొలి పర్యటన ఇదే. తరుచుగా ఏ విధానం తీసుకున్నా సింగపూర్ లా ఉండాలి అని చెప్పే చంద్రబాబు అక్కడి పరిపాలనా విధానాలు, ఏపీలో అమలు చేయాల్సిన కొత్త అంశాలను అధ్యయనం చేయనున్నారు. గతంలోనే మంత్రుల బృందం రాజధాని నిర్మాణం నమూనా కోసం విదేశీ పర్యటన చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. తాజాగా నేరుగా చంద్రబాబు పర్యటన చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.
పరిపాలన, నిర్ణయాల అమలులో తరుచుగా బాబు నోట సింగపూర్ మాట విన్పిస్తుంది. ఏది చెప్పినా ఇది సింగపూర్ లా ఉండాలి, అది సింగపూర్ లో చేసినట్లుగా చేయాలి, రాజధాని నిర్మాణంలో సింగపూర్ సలహాలు అవసరం అని విదేశీ జపం చేసేవారు. దీనిపై విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. బాబు సింగపూర్ సీక్రెట్ ఏమిటా అని తెలుసుకుని కేసీఆర్ కూడా ఒకడుగు ముందుకేసి బాబుకంటే ముందే పర్యటన చేశారనుకొండి. ఇక ప్రస్తుతం తన డ్రీమ్ వరల్డ్ కు వెళ్ళిన ముఖ్యమంత్రి అక్కడి ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. పట్టణీకరణ, నగరాల అభివృద్ధి కోసం వారు అమలు చేస్తున్న నిర్ణయాలు, ప్రభుత్వ విధానాలపై అధ్యయనం చేయనున్నారు.
ప్రధానంగా నగరీకరణ, పారిశ్రామిక అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చటం అనే అంశాలపై సలహాలు తీసుకుంటారని సమాచారం. అదేవిధంగా ఏపీ పరిస్థితులు వివరించి, రాష్ర్టంలో ఎలాంటి విధానాలు అమలు చేస్తే త్వరగా అభివృద్ధి జరుగుతుందనే విషయంపై కూడా సింగపూర్ ప్రతినిధుల నుంచి సలహాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక పర్యటనలో భాగంగా దక్షిణాసియా వార్సిక సదస్సులో కూడా బాబు ప్రత్యేక అతిధిగా పాల్గొని ప్రసంగిస్తారు. మొత్తానికి డ్రీమ్ వరల్డ్ కు వెళ్ళిన ఏపీ ముఖ్యమంత్రి సింగపూర్ నుంచి ఏం సమాచారం పట్టుకొస్తారో వేచి చూడాలి.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more