భారత్ దేశంలో స్త్రీకి సముచిత స్థానం వుంది. యత్న నార్యంతు ప్యూజ్యంతే.. తత్ర రమ్యంతే దేవతాం అంటూ.. విశ్వసించిన ఫుణ్యభూమి. అయినా.. అడవారని కూడా చూడకుండా, సహదర్మఛారిని అని అలోచించకుండా మగవాడు వారిని హింసిస్తున్నాడు. తల్లిలా సేవ చేసి, చెల్లిలా ఓదార్చి, మంత్రిలా సలహాలు ఇచ్చి, గురువులా నియమనిబంధనలు పెట్టి, భర్తే సర్వస్వం అని నమ్మి వచ్చిన ఆడవారిపై.. భారతీయ పురష అహంకార సమాజం కత్తిని పెడుతోంది. వారిని కూరలో కరివేపాకులా తీరిసారేస్తుంది. ఇది నిజం. అంతర్జాతయంగా జరిగిన సర్వేలో వెల్లడైన వాస్తవం.
ప్రతి పదిమంది భారతీయ భర్తల్లో ఆరుగురు తమ భార్యలను హింసిస్తామని అంగీకరించినట్లు ఐక్యరాజ్యసమితి అధ్యయనంలో తేలింది. అందులోనూ చిన్నతనంలో వివక్ష ఎదుర్కొన్న, ఆర్థిక సమస్యలు అనుభవించిన వారే ఎక్కువగా తమ భాగస్వామిని హింసిస్తున్నారని సోమవారం విడుదలైన ఈ అధ్యయనం పేర్కొంది. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ పాపులేషన్ ఫండ్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ వుమెన్ సంస్థలు సంయుక్తంగా ఈ నివేదిక రూపొందించాయి. సర్వేలో భాగంగా దేశంలోని ఏడు రాష్ర్టాల్లో 18 నుంచి 49 ఏండ్ల వయసున్న 9205 మంది పురుషుల అభిప్రాయాలను సేకరించారు. పురుషత్వం, భాగస్వామిని హింసించడం, కొడుకుకే ప్రాధాన్యం అన్న అంశాలపై వీళ్ల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అవమానించడం, భయపెట్టడం, బెదిరించడం, శారీరకంగా, మానసికంగా వేధించడంలాంటి అంశాలన్నింటినీ హింసలో భాగంగానే పరిగణించారు.
ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్న వారే ఎక్కువగా భాగస్వామిని హింసించినట్లు తేలింది. ఇంటిని నడిపే బాధ్యత మగవారిదే అన్న భావన కారణంగానే ఇలా జరిగి ఉండవచ్చు అని నివేదిక అభిప్రాయపడింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో ఈ అధ్యయనం చేశారు. అత్యధికంగా ఒడిశా, ఉత్తరప్రదేశ్లలో 70 శాతం మంది మగవారు తమ భాగస్వాములను హింసిస్తున్నామని అంగీకరించడం గమనార్హం. భారత్లో గతేడాది మహిళలపై జరిగిన హింసలో 38 శాతం.. భర్తలు, వారి తరఫు బంధువుల వల్లే జరిగిందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలిపింది. ఈ అధ్యయనంలో భాగంగా 3158 మంది మహిళలను కూడా సర్వే చేశారు. వీరిలో 52 శాతం మంది తమ జీవితకాలంలో ఏదో ఒకరకంగా భాగస్వామి హింసను అనుభవించినట్లు చెప్పారు. ఇందులోనూ శారీరకహింస అంటే కొట్టడం, తన్నడం, కిరోసిన్ పోసి తగులబెట్టడంలాంటివే ఎక్కువగా నమోదయ్యాయి.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more