నకిలీ డాక్యూమెంట్లు సృష్టించి.. సదరు భూములను వివాదాస్పద భూములుగా మార్చి.. అసలైన యాజమాన్య హక్కులు వున్న వారిని ముప్పుతిప్పలు పెట్టి చివరకు ఎంతొ కొంత లబ్ధి పోందే అక్రమార్కులు రోజు రోజుకు రాష్ట్రంలో విస్తరిస్తున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు పదేపదే అడుగుతున్నా.. వారిపై చర్యలను ఎలా తీసుకోగలమని ఎదురు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వ అధికారులు. రాష్ట్ర విభజనతో కొత్త రాజధాని ఏర్పాటు ప్రాంతం విజయవాడ, గుంటూరు సహా విశాఖపట్నంలోనూ ఈ తరహా కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. చివరకు అవి ఎంతవరకు చేరాయంటే.. ఏకంగా రాష్ట్ర మంత్రికి చెందిన భూములకే ఎగనామాలు పెట్టే స్థాయికి చేరాయి. ఇంతకీ ఎవరాయన అనేగా మీ డౌట్..
ఉమ్మడి రాష్ట్రంలోనూ మంత్రిగా పనిచేసి.., తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా వ్యవహరిస్తున్న గంటా శ్రీనివాసరావుకే ఈ కేటుగాళ్ల ఘటన ఎదురైంది. తన సంబంధీకులకు చెందిన భూములకే నకిలీ డాక్యూమెంట్లు సృష్టించిన కేటుగాళ్లు.. లక్షల రూపాయలను బ్యాంకుల నుంచి రుణాలను తీసుకున్నారు. కావలి రెవెన్యూ డివిజన్లోని కొండాపురం మండలం పొట్టిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సమయంలో గంటా సంబంధీకులు పొట్టిపల్లిలో సుమారు 60 ఎకరాలను కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే కొందరు వ్యక్తులు ఆ భూములకు పట్టాలు సృష్టించి గరిమెనపెంట సహకార సంఘంలో రూ. 17 లక్షల వరకు రుణం తీసుకున్నారు.
అలాగే కలిగిరి మండలం అన్నలూరు ఎస్బీఐలో లోన్లు తీసుకున్నారు. ఎర్రబల్లి యూనియన్ బ్యాంక్లోనూ రూ.10 లక్షల వరకు లోన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని ఇటీవలే గుర్తించిన మంత్రి గంటా అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. కావలి ఆర్డీఓ లక్ష్మీనరసింహం స్పందిస్తూ గంటా భూముల వివాదం తమ దృష్టికి వచ్చిందన్నారు. నకిలీ పట్టాలు సృష్టించి రుణాలు తీసుకున్న వారికి నోటీసులు జారీ చేశామన్నారు. అయితే మంత్రి కాబట్టి గంటా భూములకు నకిలీ డాక్యూమెంట్లు సృష్టించి రుణాలు తీసుకున్న కేటుగాళ్లులపై తక్షణ చర్యలకు ఉపక్రమించిన అధికారులు.. సామాన్యుల విషయంలో ఎందుకు కల్పించుకోరని విమర్శలు పెద్ద ఎత్తున వినబడుతున్నాయి. ఇప్పటికనా అధికారులు ఈ తరహా నకిలీ డాక్యూమెంట్లను సృష్టించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more