శ్రీశైలం జలవిద్యుత్తు ఉత్పత్తి విషయంలో పోరాటం కొనసాగించాలని, కృష్ణా రివర్ బోర్డు ఇచ్చిన ఆదేశాలపై అప్పిలేట్ ట్రిబ్యునల్ను ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ కూడాఅయిన కేంద్ర మంత్రి ఉమాభారతికి ఇచ్చేందుకు ఒక లేఖను సిద్ధం చేసింది. శ్రీశైలంలో విద్యుదుత్పత్తి విషయంలో కృష్ణా రివర్ బోర్డు ఆంధ్రప్రదేశ్కు సానుకూలంగా వ్యవహరిస్తున్నదని ఆ లేఖలో ఆరోపించింది. ఈ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సీఎం కేసీఆర్ సూచించారు.
ఈ మేరకు ఆర్ విద్యాసాగర్రావు నీటి పారుదల శాఖ అధికారులు, న్యాయ నిపుణులతో సుదీర్ఘంగా చర్చించి కేంద్రానికి లేఖ సిద్ధం చేశారు. పునర్విభజన చట్టంలో తెలంగాణకు 54 శాతం, ఆంధ్రాకు 46 శాతం విద్యుత్తు వాడుకోవాలని చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ ఏపీ ప్రభుత్వం పాటించటం లేదని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. గత 60 ఏళ్లుగా తెలంగాణ ప్రాంతానికి నీటి వాటాల్లో జరుగుతున్న అన్యాయాన్ని ఇటీవల జరిగిన సమావేశంలో కృష్ణా రివర్ బోర్డు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదనే విషయాన్ని ప్రస్తావించినట్టు తెలిసింది.
ట్రిబ్యునల్కు తప్ప బోర్డుకు నీటి కేటాయింపులు జరిపే అధికారం లేదనిచ,ఈ విషయంలో ట్రిబ్యునల్ జోక్యం చేసుకోవాలని తెలంగాణ సర్కారు కోరనుంది. మంత్రి హరీశ్రావు స్వయంగా ఢిల్లీ వెళ్లి అప్పిలేట్ ట్రిబ్యునల్ ఛైర్మన్ కేంద్ర మంత్రి ఉమాభారతికి లేఖ అందించనున్నారు. ఈ మేరకు కేంద్రమంత్రి అపాయింట్మెంట్ తీసుకున్నారు. కృష్ణా జలాల వినియోగంలో కేటాయింపులు జరిపే అధికారం బోర్డు పరిధిలోనిది కాదని, ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. నవంబరు 2వ తేదీ వరకు మూడు టీఎంసీల నీటిని వినియోగించాలని కృష్ణా బోర్డు సూచించటం సరికాదన్నారు. 2వ తేదీలోగా మూడు టీఎంసీలు మాత్రమే వాడుకోవాలన్నారు తప్ప. ఆ తర్వాత విద్యుత్తు ఉత్పత్తి నిలిపేయాలని ఎక్కడా పేర్కొన లేదని గుర్తు చేశారు. కేంద్ర మంత్రికి స్వయంగా వెళ్లి లేఖ అందజేస్తామని ఆయన టీ మీడియాతో పేర్కొన్నారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more