నిత్యం పళ్ల రసాలను సేవిస్తున్నారా..? అయితే కొంచెం అప్రమత్తంగా వుండండి. నిత్యం పండ్ల రసాలను తీసుకోవడం కూడా ఆరోగ్యానికి హాని కరమని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రతిరోజు క్రమం తప్పకుండా పళ్ల రసాలను తీసుకునే వారు కూడా హృదయ సంబంధిత జబ్సులకు గురికావాల్సివస్తుందని తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. తరచుగా పండ్ల రసాలను తీసుకునే వారు గుండెపోటుతో పాటు సంబంధిత వ్యాధులకు గురవుతారని అస్ట్రేలియాలోని స్విన్ బర్న్ యూనివర్శిటీ ఆప్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం చేసిన తాజా అధ్యయానాలు వెల్లడించాయి.
పళ్లరసాలు తీసుకునే వారిపై అద్యయనం చేసిన డాక్టర్ మ్యాథువ్ పేస్ మరిన్నీ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. పళ్ల రసాలలోని వున్న తీయని పదార్థాలు వాటిని సేవించేవారిలో రక్తపోటు అధికం చేస్తుందని తెలిపారు. అప్పడుప్పుడు పళ్ల రసాలను తీసుకునే వారితో పోల్చితే.. ప్రతిరోజు పళ్లరసాలను తీసుకునేవారిలో రక్తపోటు అధికంగా నమోదువుతున్నట్లు చెప్పారు. తద్వారా వీరికి గుండెపోటు, గుండె దమనుల వ్యాధులతో పాటు మేధోపరమైన వైకల్యాలకు కూడా దారి తీసే ప్రమాదముందని వైద్యులు తెలిపారు.
పళ్ల రసాలు అధికంగా శరీరానికి కావాల్సిన విటమిన్లు వుండడంతో అవి ఆరోగ్యానికి చాలా మంచివని పిల్లలతో పాటు పెద్దలు కూడా ప్రతిరోజూ వాటిని సేవిస్తారని.. కానీ అవి అనుకున్నంత మంచి కన్నా చేటును కూడా కలగజేస్తాయని మ్యాథీవ్ పేస్ తెలిపారు. విటమిన్ల విషయం పక్కన బెడితే.. పళ్ల రసాలలో అధిక మోతాదులో వున్న తీపి పదార్థాలు ముప్పుగా పరిణమించనున్నాయని తెలిపారు. పళ్ల రసాలు మంచివన్న ఉద్దేశ్యం పాతుకుపోయిన నేపథ్యంలో ఈ అధ్యయనం మేలు చేసిందనన్నారు. అన్నింటిలోని నారింజ పండు రసం అధిక ప్రమాదకారిగా వైద్యులు తెలిపారు. పావు లీటరు నారింజ రసంలో 115 కాలరీల ఎనర్జీ వస్తుందని, ఇది ఏడు టేబుల్ స్పూన్ల పంచధారతో సమానమన్నారు. కోలా పూర్తి బాటిల్ లో 139 కాలరీల ఎనర్జీ నిక్షిప్తమౌవుందని తెలిపారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ పిషార్సుల మేరకు రోజుకు ఒక వ్యక్తి కేవలం ఆరు చెంచాల పంచధారను మాత్రమే వినియోగించాలని మ్యాధువ్ పేస్ తెలిపారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more