విభజన తరువాత ఆంధ్ర - తెలంగాణ రాష్ట్రాలకు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన బాబు, కేసీఆర్ లలో పరిపాలనా విభాగంలో చంద్రబాబే ముందున్నారని ఆయనను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. రాజకీయరంగంలో 30 సంవత్సరాలవరకు అనుభవమున్న బాబు ఎంతో తెలివితేటలకు ఉపయోగించి ఆంధ్రరాష్ట్రానికి మేలు చేస్తున్నారని.. కానీ కేసీఆర్ మాత్రం అటువంటి నిర్ణయాలేమీ తీసుకోకుండా తన రాష్ట్రాన్ని చీకటిరాజ్యంగా మార్చుకున్నారని ఎంతోమంది నాయకులు తమతమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ విధంగా పేర్కొంటున్నది తమతమ పార్టీలకు చెందిన నాయకులు కాదు.. ఇతర పార్టీలకు చెందిన నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తమ మనసులోని మాటలను బయటపెడుతున్నారు. గతంలో చంద్రబాబు కంటే కేసీఆరే మేలంటూ వ్యాఖ్యలు చేసిన సందర్భాలూ చాలావరకు వున్నాయి.
ఇదిలావుండగా.. కేంద్రమాజీమంత్రి జైపాల్ రెడ్డి తనదైన రీతిలో ఈ ఇద్దరు సీఎంల మీద తన అభిప్రాయాన్ని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆలస్యంగా పదవి చేపట్టినా.. తన సామర్థ్యంతో ఆకట్టుకునేలా పనిచేస్తున్నారని ప్రశంసించారు. అలాగే బాబుకంటే ముందే సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్.. అధికారగర్వంతో ఇంతవరకు ఏపని సరిగ్గా చేయలేదని మండిపడ్డారు. ముందుగా పదవి చేపట్టినా అతను ఎందుకు విద్యుత్ ను కొనుగోలు చేయలేదని నిలదీశారు. అదే బాబు పదవి చేపట్టగానే ముందుచూపుతో విద్యుత్ ను కొనుగోలు రాష్ట్రంలో విద్యుత్ సమస్య లేకుండా చేసుకున్నారని ఆయన కితాబిచ్చారు. నిజానికి విభజన బిల్లులో తెలంగాణాకే ఎక్కువ విద్యుత్ కేటాయించినా.. కేసీఆర్ రాష్ట్రంలో విద్యుత్ సమస్య లేకుండా చేయలేకపోయారని తెలిపారు. ‘‘పదవులు వుంటాయి, పోతాయి.. కానీ మనం చేసే పనులే శాశ్వతంగా నిలిచిపోతాయి. కేసీఆర్ ఈ సూత్రాన్ని మరిచినట్టున్నారు’’ అంటూ ఆయన పేర్కొన్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more