ఈమధ్యకాలంలో అగంతకుల దాడులు చాలా ఎక్కువగా మితిమీరిపోతున్నాయి. కేవలం తమ ఆకలిని తీర్చుకోవడం కోసం ఇతరుల ప్రాణాలను బలితీసుకుంటున్నారు. ఇక మేటర్ లోకి వస్తే.. దక్షిణాఫ్రికా ఫుట్ బాల్ కెప్టెన్ సెంజో మెయివా అగంతకుల దాడుల్లో దారుణ హత్యకు గురయ్యాడని తెలిసింది. తన ప్రియురాలి కెల్లీ ఖుమా నివాసంలోకి ఇద్దరు దుండగులు నేరుగా దూరి విచక్షణారహితంగా కాల్పులు జరిపారని.. ఆ సమయంలో తన ప్రేయసిని రక్షించుకోవడానికి అడ్డుపడిన సెంజోను దుండగులు దారుణంగా కాల్చి చంపారని పోలీసులు తెలిపారు. ఈవిధంగా దాడి చేసిన అనంతరం ఇంటి బయట కాపలాకాస్తున్న వ్యక్తితో కలిసి కాల్పులు జరిపిన వ్యక్తి పరారయ్యాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
అయితే ఈ ఘాతుకం అంతా కేవలం సెల్ ఫోన్ కోసం జరిగిందని స్థానిక మీడియా తన కథనంలో వెల్లడించింది. దాడి చేయడానికి ముందు ఇంట్లోకి చొరబడిన అగంతకులు సెంజోను మొబైల్ ఫోన్ ఇవ్వమని డిమాండ్ చేశారని.. ఆ సమయంలోనే అతని ప్రియురాలు అక్కడ ప్రత్యక్ష్యం కావడంతో తమను అటాక్ చేస్తుందేమోనన్న భయంతో వారు కాల్పులు జరిపారని.. ఆ సమయంలో ఆమెను కాపాడబోయి సెంజో దారుణహత్యకు గురయ్యాడని స్థానిక మీడియా కథాంశం! కాల్పులు జరిపిన అనంతరం పారిపోగా.. తీవ్రంగా గాయపడిన సెంజోను ఆస్పత్రికి తరలిస్తుండగానే తుదిశ్వాస విడిచాడని తెలిపారు.
ఈవిధంగా దాడికి పాల్పడిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని దక్షిణాఫ్రికా పోలీస్ సర్వీసెస్ ఓ ట్విటర్ ల వార్తను పోస్ట్ చేశారు. దుండుగుల ఆచూకీ తెలిపిన వారికి రూ.8.50 లక్షల భారీ నజరానాను కూడా ప్రకటించినట్టు ఓ వెబ్ సైట తెలిపింది. ది ఓర్లాండో పైరేట్స్ జట్టుకు కెప్టెన్ గా, గోల్ కీపర్ గా వ్యవహరించిన సెంజో మెయివా మరణంపై జట్టు సంతాపం తెలిపింది. అతను నెంబర్ వన్ గోల్ కీపరని పేర్కొన్నారు కూడా! ఇటువంటి గొప్ప ఆటగాడు ఈవిధమైన దారుణ హత్యకు గురవుతాడని తాము ఏనాడూ ఊహించలేదని ఆటగాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలావుండగా.. మరో మీడియాకథనం ప్రకారం సెయింట్ జోసెఫ్ తన నివాసంలోనే వున్నాడని.. ఆ సమయంలో అతనితోపాటు ఏడుగురు వ్యక్తులు కూడా వున్నారని తెలుపుతోంది. అయితే అప్పుడు వారిమధ్య వాగ్వివాదం జరిగిందని.. అనంతరం అక్కడినుంచి వెళ్లిపోయిన కొంతమందిలో తిరిగి వచ్చి అతనిపై కాల్పులు జరిపినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారని తెలిపింది. కథనం ఏదైతేనేం.. ఒక జట్టులో వుండే కీలక ఆటగాడు ఇలా దారుణంగా మరణించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more