Haj png

Bangladesh, Air India, India, Pakistan, Maharashtra, Asia, South Asia

33 Indians die during Hajj pilgrimage in Saudi Arabia

హజ్ యాత్రలో 33 మంది భారతీయుల మృతి

Posted: 09/28/2014 01:28 PM IST
Haj png

మహ్మదీయుల పవిత్ర పుణ్యస్థలం హజ్ యాత్రకు వెళ్లిన యాత్రికులలో 33 మంది భారతీయులు మృత్యువాత పడ్డారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన సుమారు 80మంది యాత్రికులలో 33 మంది భారతీయులు వున్న్లు సౌదీ అరేబియా మీడియా వర్గాలు వెల్లడించాయి. సౌదీ అరేబియాకు చేరుకున్న యాత్రికులు అనారోగ్యం, వృద్దాప్యం తదితర కారణాలతో మరణించారని అక్కడి అధికార వర్గాలు తెలిపాయి.

మృతులలో 33 మంది భారతీయులు వుండగా, 25 మంది పాకిస్థాన్, 22 మంది బంగ్లాదేశ్ యాత్రికులు మృతి చెందినట్లు పౌదీ అధికార వర్గాలు తెలిపాయి. హజ్ యాత్రకు బయలుదేరి వస్తూనే ఎయిర్ ఇండియా విమానంలో అనారోగ్యం బారిన పడి గులాం షబ్బీర్ హుస్సేన్ అనే మహారాష్ట్ర వాసి మృతిచెందినట్లు తెలిపాయి. మృతులలో అత్యధిక మందిని మక్కాలోనే అంతిమ సంస్కారాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

కాగా హజ్ యాత్రకు వస్తున్న యాత్రికులు మృతిచెందడంపై సౌదీ ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఏడాదికేడాది యాత్రికుల మృతుల పెరగడంపై దృష్టి సారించింది. హాజ్ యాత్రకు వస్తున్నవారిలో అత్యధికులు వృద్ధులు కావడంతోనే వారు దిగులుతో అనారోగ్యం బారిన పడుతున్నారని భావిస్తోంది. హజ్ లో మరణిస్తే సర్గం ప్రాప్తిస్తుందన్న భావనతోనే వృద్ద మహ్మదీయులు ఇక్కడ మరణిస్తున్నారని సౌదీ అరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bangladesh  Air India  India  Pakistan  Maharashtra  Asia  South Asia  

Other Articles