సబ్సీబీ కింద ప్రజలకు అందిస్తున్న ఆహార ధాన్యాలను పెంచే యోచన ప్రభుత్వానికి లేదని కేంద్ర ఆహార శాఖా మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ అన్నారు. ప్రస్తుతం ప్రతి వ్యక్తికి నెలసరి కోటా కింద లభిస్తున్న ఆహార ధాన్యాలను 5 నుండి 7 కేజీలను పెంచుతున్నారన్న వార్తలను అయన తోసిపుచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి అలాంటి ఆలోచన లేదన్నారు. ఆహార భద్రతా బిల్లు కింద ప్రతీ వ్యక్తి 5 నుంచి 7 కేజీలకు కోటా పెరగాల్సిన ఉన్నా.. ఇప్పుడు ప్రభుత్వానికి అటోచన లేదన్నారు. ఆహార భద్రతా బిల్లు దేశంలోని మూడింట రెండోంతుల మందికి ఆహారధాన్యాలను సబ్సీడీ కింద అందించే లక్ష్యమే వుందన్నారు.
ఈ చట్టం కింద ప్రతీ అర్హుడైన వ్యక్తికి 5 కేజీల బియ్యం, మూడు కేజీల గోధుమలను సబ్సీడీ ధరల కింద అందిస్తున్నామని చెప్పారు. అంత్యోధయ అన్న యోజన లబ్దిదారు కుటుంబాలకు, అతిపేద కుటుంబాలకు నెలకు 35 కేజీల ఆహారధాన్యాలను సబ్సీడీ ధరల కింద అందిస్తున్నామని కేంద్రమంత్రి చెప్పారు. గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి అర్హులైన వ్యక్తులకు సబ్సీడీ ఆహార ధాన్యాలను ఐదు కిలోల నుంచి ఏడు కిలోలకు పెంచాలన్న డిమాండ్ వస్తుందని, అయితే ప్రస్తుతానికి పెంచే యోచన లేదన్నారు.
ఆహార భద్రతా చట్టం కింద కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రస్తుతం నిల్వ సామర్థ్యంగా 75.8 మిలియన్ టన్నుల ఆహార ధాన్యలు కాగా, వాటిలో ప్రతీ నెల 61 మిలియన్ టన్నలును పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత ఏడాది దేశ వ్యాప్తంగా బియ్యం, గోధుమల ఉత్పత్తి 200 మిలియన్ టన్నలని పాశ్వాన్ తెలిపారు. ప్రస్తుతం కేవలం ఐదు రాష్ట్రాలు మాత్రమే ఆహార భద్రతా చట్టాన్ని సంపూర్ణంగా అమలు చుస్తుండగా, మరో ఆరు రాష్ట్రాలు మాత్రం అసంపూర్ణంగా అమలు చేస్తున్నాయన్నారు. సుమారు 25 రాష్ట్రాలతో పాటు పలు కేంద్ర పాలిత ప్రాంతాలలో కూడా ఆహార భద్రతా చట్టాన్ని అమలుపర్చాల్సి వుందని చెప్పుకోచ్చారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more