ఫొటో మార్ఫింగ్ లు కొత్తేం కాదు. ప్రముఖులు, హీరోలు, హీరోయిన్లు, రాజకీయ నేతలు ఇలా ఎవరి ఫొటోలనైనా మార్ఫింగ్ చేసి నెట్ లో పెట్టేయటం ఈ మద్య అలావాటైపోయింది. అయితే కొన్నిసార్లు వారి తుంటిర చేష్టలకు కోర్టుకేసులు, చీవాట్లు తప్పవు. ఇప్పుడు టీడీపీకి కూడా అదే పరిస్థితి ఎదురుకానుంది. తెలుగుదేశం పార్టీ ఫేస్ బుక్ పేజ్ పై కేసీఆర్ అభిమానులు ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ముఖంలో హిట్లర్ పోలికలు ఉన్నాయని పోలికలు చూపుతూ మార్ఫింగ్ చేసిన ఫొటోను ఈ మద్య టీడీపీ ఫేస్ బుక్ పేజిలో నిర్వాహకులు పోస్ట్ చేశారు. దీనికి చాలా లైకులు పడ్డాయి. కామెంట్లలో రెండు వర్గాల నెటిజన్లు తిట్టుకుని కొట్టుకున్నారు. కూడా.
ఈ ఫొటో మార్ఫింగ్ పై కేసీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్ఫింగ్ చేసి తమ అభిమాన నేతను అవమానించారంటూ... కేసీఆర్ అభిమాన సంఘం రాష్ర్ట అధ్యక్షుడు కులకర్ణి, మహిళా అద్యక్షురాలు సుశీలారెడ్డి సెప్టెంబర్ 12న ఎల్బీనగర్ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుపై వారు మొదటగా కేసు నమోదు చేయలేదు. వారం రోజుల తర్వాత అంటే సెప్టెంబర్ 19న శుక్రవారం రోజు కేసు పెట్టారు. టీడీపీ ఫేస్ బుక్ పేజిపై సెక్షన్ 504, 506 ప్రకారం కేసు పెట్టినట్లు పోలిసులు తెలిపారు.
అయితే ఈ కేసులో ఫేస్ బుక్ లో ఫొటో పోస్ట్ చేసినట్లుగా ఎవరి పేరునూ నమోదు చేయలేదు. విచారణ జరిపి.., పోస్ట్ చేసిన వారితో పాటు, మార్ఫింగ్ చేసినవారు, వెబ్ సైట్ నిర్వాహకులపై కేసు పెడతామని ఎల్బీనగర్ పోలిసులు తెలిపారు. ఏదో సరదాకి చేస్తే సరే పోనిలే అనుకుంటాం కానీ.. రాజకీయ పార్టీలు కూడా ఇలా మార్ఫింగులు చేస్తే మామూలుగా ఉండదు అని కేసీఆర్ ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. ఆత్మగౌరవ సమస్య అంటే ఇదేనేమో బహుశా !!.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more