భారత దేశాన్ని నాశనం చేయాలన్న దుర్బుద్దితో బతుకుతున్న పాకిస్థాన్ ఇందుకోసం ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటోంది. భారత్ లక్ష్యంగా పనిచేసేందుకు ఎవరి కాళ్ళయినా పట్టుకుంటోంది... ఇంకేమైనా చేస్తోంది. పాకిస్థానిలతొ పాటు భారతీయులనే తీవ్రవాదంతో రెచ్చగొట్టి భరతమాతపై దాడికి ఉసిగొల్పిన దాయాది దేశం.. తాజాగా లంకేయులను ఉపఖండంపై యుద్ధానికి సిద్ధం చేస్తోంది. పొరుగుదేశమైన శ్రీలంక ప్రజలను భారత్ లో దాడుల కోసం వినియోగించుకుంటోంది. విస్తుగొలిపే ఈ విషయాలు ఇటీవల పట్టుబడ్డ శ్రీలంక జాతీయులు వెల్లడించారు. అయితే ఈ కుట్రకు పాల్పడుతుంది పాక్ సైనిక సంస్థ అయిన ఐ.ఎస్.ఐ. అని తెలిసి మన పోలిసులు మరింత ఆశ్చర్యపోయారు. పాక్ ఆర్మీ చివరకు ఇంత నీచానికి దిగజారిందా అని మండిపడుతున్నారు.
పాకిస్థాన్ కు చెందిన ఇంటలిజెన్స్.. ఐ.ఎస్.ఐ. భారత దేశంలో దాడులు, దాడులకు సంబంధించిన రెక్కి నిర్వహించేందుకు ముందుగా పాకిస్థానీలను టార్గెట్ ప్లేస్ లకు పంపేది. అయితే వారి చొరబాటు, తిరిగి వెళ్లటంలో తీవ్ర ఇబ్బందులు ఉండటంతో.., కొద్దికాలంగా ఈ పనికోసం భారతీయులను వాడుకుంటోంది. అయితే వారిని కూడా పోలిసులు అరెస్టు చేస్తుండటంతో కొత్త ప్లాన్ వేసింది. అదే శ్రీలంక ప్రజలను తమ పనికోసం వాడుకోవటం. లంకలోని ముస్లింలను మతం పేరుతో రెచ్చగొట్టి.., వారిని ఉగ్రవాదం వైపు మరల్చి భారత్ లోకి పంపిస్తున్నారు. ఇక్కడి ప్రదేశాలు, జనరద్దీ, భద్రతా చర్యలతో పాటు దేశానికి చెందిన కీలక సమాచారాన్ని పాక్ సేకరిస్తోంది. దాడులు చేయాలనుకునే ప్రాంతాలపై రెక్కి నిర్వహించేందుకు కూడా లంక ముస్లింలను ఉపయోగించుకుంటున్నారు.
ఈ కుట్ర చాలాకాలంగా జరుగుతున్నట్లు తెలుస్తున్నా.., ఏడాది కాలంగా జరుగుతున్న అరెస్టులతో విషయం బయటకు వచ్చింది. వివిధ సందర్బాల్లో అరెస్టయిన లంక ముస్లింలు విచారణలో తాము పాకిస్థాన్ కోసం పనిచేస్తున్నట్లు అధికారులకు తెలిపారు. ఇప్పటివరకు ఇలా ముగ్గురు లంక ముస్లింలు అరెస్టయ్యారు. ఐ.ఎస్.ఐ. తోపాటు లష్కరే తోయిబా.. ఇతర ఉగ్రవాద సంస్థలు కూడా ఇదే తరహాలోలంకేయులను వాడుకుంటున్నాయి. ఈ కుట్రలు తెలిసిన కేంద్ర నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. దాయాది సైన్యం దేశంపై చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టడంలో సమర్ధంగా వ్యవహరించాలని.., ప్రతి అనుమానితుడినీ ప్రశ్నించాలని సిబ్బందికి స్పష్టం చేశారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more