Pakisthan using srilanka muslims for attacks in india

pakisthan army, intelligence, ISI, pakisthan border, india pakisthan border, latest news, indian army, terrorists, laskar e toiba, alqeada, terror, attacks, blasts, srilanka, srilanka army, srilanka tourism

pakisthan ISI and laskar e toiba other agencies using srilanka muslims for recky and attacks in India : intelligence beurew get alerted by srilanka muslims arrest after they said that they working for pakisthan army

పాక్ కోసం భారత్ పై దాడి చేస్తున్న రావణసేన

Posted: 09/15/2014 09:20 AM IST
Pakisthan using srilanka muslims for attacks in india

భారత దేశాన్ని నాశనం చేయాలన్న దుర్బుద్దితో బతుకుతున్న పాకిస్థాన్ ఇందుకోసం ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటోంది. భారత్ లక్ష్యంగా పనిచేసేందుకు ఎవరి కాళ్ళయినా పట్టుకుంటోంది... ఇంకేమైనా చేస్తోంది. పాకిస్థానిలతొ పాటు భారతీయులనే తీవ్రవాదంతో రెచ్చగొట్టి భరతమాతపై దాడికి ఉసిగొల్పిన దాయాది దేశం.. తాజాగా లంకేయులను ఉపఖండంపై యుద్ధానికి సిద్ధం చేస్తోంది. పొరుగుదేశమైన శ్రీలంక ప్రజలను భారత్ లో దాడుల కోసం వినియోగించుకుంటోంది. విస్తుగొలిపే ఈ విషయాలు ఇటీవల పట్టుబడ్డ శ్రీలంక జాతీయులు వెల్లడించారు. అయితే ఈ కుట్రకు పాల్పడుతుంది పాక్ సైనిక సంస్థ అయిన ఐ.ఎస్.ఐ. అని తెలిసి మన పోలిసులు మరింత ఆశ్చర్యపోయారు. పాక్ ఆర్మీ చివరకు ఇంత నీచానికి దిగజారిందా అని మండిపడుతున్నారు.

పాకిస్థాన్ కు చెందిన ఇంటలిజెన్స్.. ఐ.ఎస్.ఐ. భారత దేశంలో దాడులు, దాడులకు సంబంధించిన రెక్కి నిర్వహించేందుకు ముందుగా పాకిస్థానీలను టార్గెట్ ప్లేస్ లకు పంపేది. అయితే వారి చొరబాటు,  తిరిగి వెళ్లటంలో తీవ్ర ఇబ్బందులు ఉండటంతో.., కొద్దికాలంగా ఈ పనికోసం భారతీయులను వాడుకుంటోంది. అయితే వారిని కూడా పోలిసులు అరెస్టు చేస్తుండటంతో కొత్త ప్లాన్ వేసింది. అదే శ్రీలంక ప్రజలను తమ పనికోసం వాడుకోవటం. లంకలోని ముస్లింలను మతం పేరుతో రెచ్చగొట్టి.., వారిని ఉగ్రవాదం వైపు మరల్చి భారత్ లోకి పంపిస్తున్నారు. ఇక్కడి ప్రదేశాలు, జనరద్దీ, భద్రతా చర్యలతో పాటు దేశానికి చెందిన కీలక సమాచారాన్ని పాక్ సేకరిస్తోంది. దాడులు చేయాలనుకునే ప్రాంతాలపై రెక్కి నిర్వహించేందుకు కూడా లంక ముస్లింలను ఉపయోగించుకుంటున్నారు.

ఈ కుట్ర చాలాకాలంగా జరుగుతున్నట్లు తెలుస్తున్నా.., ఏడాది కాలంగా జరుగుతున్న అరెస్టులతో విషయం బయటకు వచ్చింది. వివిధ సందర్బాల్లో అరెస్టయిన లంక ముస్లింలు విచారణలో తాము పాకిస్థాన్ కోసం పనిచేస్తున్నట్లు అధికారులకు తెలిపారు. ఇప్పటివరకు ఇలా ముగ్గురు లంక ముస్లింలు అరెస్టయ్యారు. ఐ.ఎస్.ఐ. తోపాటు లష్కరే తోయిబా.. ఇతర ఉగ్రవాద సంస్థలు కూడా ఇదే తరహాలోలంకేయులను వాడుకుంటున్నాయి. ఈ కుట్రలు తెలిసిన కేంద్ర నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. దాయాది సైన్యం దేశంపై చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టడంలో సమర్ధంగా వ్యవహరించాలని.., ప్రతి అనుమానితుడినీ ప్రశ్నించాలని సిబ్బందికి స్పష్టం చేశారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakisthan  isi  srilanka muslims  latest news  

Other Articles