ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ వైపు అక్టోబర్ 2నుంచి అన్న క్యాంటిన్లు నిర్వహించేందుకు స్థలం వెతుకుతుంటే.., మరోవైపు నేతలు అప్పడే అడ్డుపుల్లలు వేయటం మొదలుపెట్టారు. పధకం ప్రారంభమే కాలేదు.., అప్పుడే ఇది అవసరమా.., దండగ కదా అని డిక్లేర్ చేస్తున్నారు. పోని అది విపక్షాలు లేదా ఉద్యమ, ప్రజా సంఘాల నేతలు అంటే సరే అనుకోవచ్చు కానీ... అధికార పక్ష ఎమ్మెల్యేలే ప్రభుత్వ పధకాన్ని తప్పుబడుతున్నారు. ఆంధ్రలో అన్న అన్నం అవసరం లేదంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ మాట అన్నారు.
ఏపీలో వచ్చే నెలలో ప్రారంభం అయ్యే ‘అన్న క్యాంటిన్ల’పై స్పందించిన ప్రభాకర్ రెడ్డి.., కొన్ని పధకాలను ప్రభుత్వం ఎందుకు తీసుకువస్తుందో అర్ధం కావటం లేదన్నారు. అందులో అన్న క్యాంటిన్లు ఒకటని చెప్పారు. తమిళనాడులో జయసర్కారు నిర్వహిస్తున్న అమ్మ క్యాంటీన్ల మాదిరిగా ఇక్కడ నడుపుతామంటే కుదరదన్నారు. తమిళ తంబీలు సాంబారు, అన్నంతో కడుపునింపుకుంటారని.., అయితే ఆంధ్రలో ఆ పద్దతి ఉండదని చెప్పారు. కూరలు, ఊరగాయలు ఎలా పెడతారని ప్రశ్నించారు. అయితే హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో ఇస్కాన్ వంటి సంస్థలు ఐదు రూపాయలకే కూర, సాంబారు, పచ్చడతో అన్నం పెడుతున్నాయని విలేకర్లు ప్రశ్నంచగా దానికీ జేసీ సమాధానం చెప్పారు.
ఇస్కాన్ భోజనం ఆదర్శంగా తీసుకుంటే వారి పప్పులో కాలేసినట్లే అని చెప్పారు. అంతేకాదు ఇస్కాన్ భోజనంలోనే చాలా లోపాలున్నాయని చెప్పారు. అయితే అదేమిటో ఎమ్మెల్యే వివరించలేదు. అంతేకాకుండా భోజనం పెట్టాలంటే తమను చూసి నేర్చుకోవాలని ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. ఇక చివరగా స్కూళ్ళలో మధ్యాహ్నభోజనమే సరిగా అందిచలేనపుడు అన్న క్యాంటిన్ల ద్వారా ఎలా నాణ్యమైన ఆహారం అందిస్తారని ప్రశ్నించారు. ఏడేళ్ళుగా తాడిపత్రిలో తాము మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని.., ఎలా కార్యక్రమం నిర్వహిస్తున్నాము, భోజనం నాణ్యతను తాడిపత్రికి వచ్చి చూసి తెలుసుకోండి అని హితవు పలికారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more